New Political Party For Uttarandhra: ఉత్తరాంధ్ర కోసం కొత్త పార్టీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్గా కొనసాగుతూనే ఉంది.. మా విధానం మూడు రాజధానులు. మా నిధానం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి… ఇదే మా లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి సంగతి తేలితే కానీ మూడు రాజధానుల కాన్సెస్ట్ ఫైనల్ కాదు. అయితే ఈ లోగా కొత్త కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అమరావతే రాజధాని అంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అమరావతిలో భూములన్నీ కొనేసిన చంద్రబాబు… అక్కడే రాజధాని పెట్టి దాన్ని మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని… దానికి తాము అంగీకరించబోమని అన్నారు మంత్రి. ఒకవేళ అమరావతే రాజధాని గా ఉంటుంది అంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్ర భుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ఇలా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ధర్మాన ఎందుకు ఇలా మాట్లాడారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే…. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడమే ధర్మాన ఉద్దేశం అంటున్నారు. ఒకవేళ అలా కాకుంటే అమరావతితో ఉత్తరాంధ్రకు వచ్చే నష్టాన్ని జనానికి వివరించి చెప్పడానికే ధర్మాన అలా అని ఉంటారని అంటున్నారు. విడిపోయి ఇప్పటికే నానాఇబ్బందిపడుతున్న రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మరోవైపు ఉత్తరాంధ్ర రాష్ర్టం ఎజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమౌతుంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ర్టం సాధించడం ద్వారానే అభివృధ్ది సాధ్యం అంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ నినాదం ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!