New Political Party For Uttarandhra: ఉత్తరాంధ్ర కోసం కొత్త పార్టీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్గా కొనసాగుతూనే ఉంది.. మా విధానం మూడు రాజధానులు. మా నిధానం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి… ఇదే మా లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి సంగతి తేలితే కానీ మూడు రాజధానుల కాన్సెస్ట్ ఫైనల్ కాదు. అయితే ఈ లోగా కొత్త కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అమరావతే రాజధాని అంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అమరావతిలో భూములన్నీ కొనేసిన చంద్రబాబు… అక్కడే రాజధాని పెట్టి దాన్ని మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని… దానికి తాము అంగీకరించబోమని అన్నారు మంత్రి. ఒకవేళ అమరావతే రాజధాని గా ఉంటుంది అంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్ర భుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ఇలా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ధర్మాన ఎందుకు ఇలా మాట్లాడారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే…. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడమే ధర్మాన ఉద్దేశం అంటున్నారు. ఒకవేళ అలా కాకుంటే అమరావతితో ఉత్తరాంధ్రకు వచ్చే నష్టాన్ని జనానికి వివరించి చెప్పడానికే ధర్మాన అలా అని ఉంటారని అంటున్నారు. విడిపోయి ఇప్పటికే నానాఇబ్బందిపడుతున్న రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మరోవైపు ఉత్తరాంధ్ర రాష్ర్టం ఎజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమౌతుంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ర్టం సాధించడం ద్వారానే అభివృధ్ది సాధ్యం అంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ నినాదం ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!