తగ్గేదేలే.. ఎస్మాకు భయపడేదేలే.. సమ్మెలోకి వైద్యారోగ్య శాఖ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మెపై వెనక్కి తగ్గేదేలే అని తేల్చాశాయి ఉద్యోగ సంఘాలు.. ఇవాళ సమావేశమైన వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ.. సమ్మెపై ఓ నిర్ణయానికి వచ్చింది.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం తర్వాత మీడియాకు వెళ్లడించారు నేతలు.. వైద్యారోగ్య శాఖ గత రెండున్నరేళ్ల కాలంగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తోన్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కరోనా కాలంలో సెలవులు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన రాక్షస అధికారుల పాలన సాగుతోందని ఆరోపించారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి ఆస్కార్ రావు.. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకి అప్పజెప్పొద్దని స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆయన.. పీఆర్సీ సాధన విషయంలో సమితి నేతలతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని.. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు కూడా ఏడో తేదీన సమ్మెకు వెళ్తారని.. పీఆర్సీ సమస్యతో పాటు.. వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కరించాల్సిందే అన్నారు.
Read Also: పెట్రో ధరలు తగ్గించాల్సిందే.. భారతీయుల డిమాండ్…!
Also Read
వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కారం కాకుంటే మా ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు ఆస్కార్ రావు.. టెక్నికలుగా ఏ మాత్రం విషయం లేని జేసీలు.. మేం వైద్యం ఎలా చేయాలో చెబుతున్నారని ఫైర్ అయ్యారు.. మా ఆత్మ గౌరవం దెబ్బతింటోంది.. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.. ఇక, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులుగా మేం చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు వైద్యారోగ్య శాఖ జేఏసీ ప్రతినిధి అరవపాల్.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ అధికారులంతా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఈ ప్రభుత్వ తీరును క్షేత్ర స్థాయిలో ఏ ఒక్కరూ హర్షించడం లేదన్నారు.. ఛలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం అన్నారు.
మరోవైపు, వైద్యారోగ్య శాఖలో బదిలీలు సరికాదన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి శివారెడ్డి… ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇప్పుడు వైద్యారోగ్యశాఖలో బదిలీలు తీసుకొచ్చారని ఆరోపించిన ఆయన.. ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియను చేపట్టాలి.. కరోనా సమయంలో బదిలీలు సరికాదన్నారు.. ఇక, బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందే అని.. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.. మరోవైపు, ఎస్మాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు శివారెడ్డి.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!