Manchu Mohan Babu: మరో వివాదంలో మంచు మోహన్బాబు.. ఈ సారి షిర్డీ సాయినాథునిపై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు మంచు మోహన్బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మోహన్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదు అని వ్యాఖ్యానించారు.. షిర్డీపై మోహన్బాబు చేసిన కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు..
Read Also: Munugode ByPoll : దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలతో గులాబీ పార్టీ గుణపాఠం నేర్చుకుందా?
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఇక, ఈ గుడి కట్టాలనుకున్నప్పుడు విష్ణు బాబు ఒక మాట అన్నాడు… వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులందరూ ఈ గుడికి రావాలి.. అలా కడితే కట్టండి లేకపోతే లేదు అన్నాడని గుర్తుచేసుకున్నారు మోహన్బాబు.. అలాగే కట్టానని అనుకుంటున్నాను. మహాద్భుతంగా కట్టాం. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహా యోగులు, రుషీశ్వరులు నుంచి చెక్కలు, ఆయన లిపితో రాసిన కొన్ని అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టామన్నారు.. ఇదంతా నా ఒక్కడి కోసమే కాదు.. విద్యాలయం, పక్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం నెంబర్ వన్గా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈరోజు ప్రారంభించామని తెలిపారు.. అయితే, అదంతా ఎలా ఉన్నా.. సాయి భక్తులు ఇకపై షిర్డీకి వెళ్లనవసరం లేదని మోహన్బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు మోహన్బాబు… మంగళవారం ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మోహన్ బాబు దంపతులు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఇలా మంచు ఫ్యామిలీ మొత్తం ఆ కార్యక్రమంలో పాల్గొంది..
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?