Anantapur Crime: రెండున్నర నెలల తర్వాత వీడిన మిస్టరీ.. అతడే హంతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed His Brother In Law For Land In Anantapur: ఇంట్లో అల్లరి చేస్తూ, సరదాగా గడిపే 15 ఏళ్ల అబ్బాయి ఓరోజు ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఎక్కడ వెతికినా జాడ కనిపించలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చూస్తుండగానే రెండున్నర నెలలు గడిచిపోయాయి. అప్పుడు వెలుగులోకి వచ్చింది అసలు.. ఇంట్లో ఉన్నవాడే ఆ అబ్బాయిని కడతేర్చాడని! ఆస్తి కోసం బావమరిదిని సొంత బావే హత్య చేశాడు. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారైలున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తె వర్షితకు గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్తో వివాహమైంది. ఇతను భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు.
కట్ చేస్తే.. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిపై అనిల్ కన్ను పడింది. అయితే.. ఆ భూమి మొత్తం శారదమ్మ తన కుమారుడు అఖిల్కే ఇచ్చేస్తుందని, అలా కాకుండా ఆ భూమి తన సొంతం చేసుకోవాలంటే అఖిల్ అడ్డు తొలగించాల్సిందేనని అనిల్ భావించాడు. అందుకు అతడు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ ఏడాది మే 21న అఖిల్కు సెల్ఫోన్ బహుమానంగా ఇస్తానని నమ్మించి, బైక్లో ఎక్కించుకుని వెళ్లాడు. తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లి, అఖిల్ని హతమార్చి, సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి తిరిగొచ్చేశాడు. అయితే.. కుమారుడు కనిపించడం లేదని శారదమ్మ చుట్టూ గాలించింది. తెలిసివారిని సంప్రదించింది. ఎక్కడా లేడని తెలియడంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినా, వాళ్లకీ అతని జాడ కనిపించలేదు. ఇలా నెలరోజులు గడిచిపోయాయి.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడా? అని బాధ పడుతున్న శారదమ్మకు.. ఓరోజు తన అల్లుడు అనిల్పై అనుమానం వచ్చింది. అఖిల్ను చివరిసారిగా బైక్పై తీసుకెళ్లింది అతడే కావడంతో, ఆ విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అనిల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అతడు అసలు నిజం కక్కేశాడు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి, పూడ్చివేశానని అంగీకరించాడు. నిందితుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!