Anantapur Crime: రెండున్నర నెలల తర్వాత వీడిన మిస్టరీ.. అతడే హంతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed His Brother In Law For Land In Anantapur: ఇంట్లో అల్లరి చేస్తూ, సరదాగా గడిపే 15 ఏళ్ల అబ్బాయి ఓరోజు ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఎక్కడ వెతికినా జాడ కనిపించలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చూస్తుండగానే రెండున్నర నెలలు గడిచిపోయాయి. అప్పుడు వెలుగులోకి వచ్చింది అసలు.. ఇంట్లో ఉన్నవాడే ఆ అబ్బాయిని కడతేర్చాడని! ఆస్తి కోసం బావమరిదిని సొంత బావే హత్య చేశాడు. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారైలున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తె వర్షితకు గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్తో వివాహమైంది. ఇతను భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు.
కట్ చేస్తే.. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిపై అనిల్ కన్ను పడింది. అయితే.. ఆ భూమి మొత్తం శారదమ్మ తన కుమారుడు అఖిల్కే ఇచ్చేస్తుందని, అలా కాకుండా ఆ భూమి తన సొంతం చేసుకోవాలంటే అఖిల్ అడ్డు తొలగించాల్సిందేనని అనిల్ భావించాడు. అందుకు అతడు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ ఏడాది మే 21న అఖిల్కు సెల్ఫోన్ బహుమానంగా ఇస్తానని నమ్మించి, బైక్లో ఎక్కించుకుని వెళ్లాడు. తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లి, అఖిల్ని హతమార్చి, సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి తిరిగొచ్చేశాడు. అయితే.. కుమారుడు కనిపించడం లేదని శారదమ్మ చుట్టూ గాలించింది. తెలిసివారిని సంప్రదించింది. ఎక్కడా లేడని తెలియడంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినా, వాళ్లకీ అతని జాడ కనిపించలేదు. ఇలా నెలరోజులు గడిచిపోయాయి.
Also Read
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడా? అని బాధ పడుతున్న శారదమ్మకు.. ఓరోజు తన అల్లుడు అనిల్పై అనుమానం వచ్చింది. అఖిల్ను చివరిసారిగా బైక్పై తీసుకెళ్లింది అతడే కావడంతో, ఆ విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అనిల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అతడు అసలు నిజం కక్కేశాడు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి, పూడ్చివేశానని అంగీకరించాడు. నిందితుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!