Road Accident: కుప్పంలో ఘోర రోడ్డుప్రమాదం…ముగ్గురు వైద్యవిద్యార్ధులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను మనం చూస్తూనే ఉంటాం ప్రమాదాలకు గురైన వాహనాలు దెబ్బతినడం కూడా చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్డు ప్రమాదానికి గురైన ఒక కారు. ఆనవాళ్లు కూడా లేకుండా ఇనుప ముద్దలాగా మారిపోయింది. ఈ కారు అంటే ఎంత వేగంతో ఈ కారు ఆ లారీని ఢీ కొట్టిందో చూస్తే అర్థమవుతుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎవరైనా చెప్తే కానీ ఇది కారు అని గుర్తుపట్టలేనంత గా ధ్వంసం అయ్యిందంటే ప్రమాదం స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రూపు రేఖలు లేకుండా పోయిన ఈ కారు మారుతి స్విఫ్ట్.
చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి మండలం సెట్టిపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది కారు. ముగ్గురు వైద్య విద్యార్థులు (Medical Students) మృతిచెందారు. మృతులు PES మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. PES ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతులు వికాస్,కళ్యాణ్, ప్రవీణ్ గా గుర్తించారు. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..

దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. వీరిలో ఇద్దరు కడప (Kadapa) జిల్లాకు, ఒకరు నెల్లూరు (Nellore) జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వైద్యవిద్యార్ధుల మృతిలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన తీరు హృదయవిదారకంగా వుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలాపూర్ లో హత్య కలకలం
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు పైసల్ ఈనెల 12న అర్ధరాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నాను అని చెప్పి వెళ్ళాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంత వెతికినా ఆచూకీ లభించక తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం నిన్న రాత్రి తేదీ 25 రాత్రి 1 సమయాన మర్డర్ జరిగిందని తేలింది. అగంతకుడు జబ్బార్ తండ్రి అబ్దుల్ రహీం వయసు 17 వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు. అతని నివాసం మినర్ కాలనీ షాహిన్ నగర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Team India: సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత దీప్తి శర్మకు కొత్త బాధ్యత
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?