Loan Apps Culprits Arrest: లోన్ యాప్ వేధింపులు.. నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఒక్క క్లిక్ తో రుణాలు అంటూ ప్రజలను మోసం చేసి వేధిస్తున్న రెండుకేసులలో నలుగురు కేటుగాళ్ళను అదుపులోనికి తీసుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు…పెనమలూరులోని ఆత్కుర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన లోన్ యాప్ వేధింపుల కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేటుగాళ్లు పన్నిన వలలో చిక్కుకొని జీవితాలను బలికానివ్వద్దని తెలిపారు ఎస్పీ. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు జిల్లా ఎస్పీ. నిందితులను అదుపులోనికి తీసుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్సీ.
కుటుంబ అవసరాల నిమిత్తం, పిల్లల చదువు కోసం, ఇతర పనుల కోసం నగదు అన్వేషన్లో ఉన్న అమాయక ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకొని ఎటువంటి షురిటీ ఇవ్వాల్సిన పనిలేదని నమ్మిస్తున్నారు. డాక్యుమెంటేషన్ మాటే లేదు అంటూ ఒక్క క్లిక్ తో తక్షణ ఋణం అంటూ లోన్ యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తూన్నారు.సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ వడ్డీల పేరుతో అధిక మొత్తాలను వసూలు చేస్తూ, చెల్లించలేని పక్షంలో వారి ఫోటో లను అసభ్యంగా చిత్రీకరించి బెదిరింపులకు గురి చేస్తూ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్న లోన్ యాప్ కేటుగాళ్లను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
Read Also: Loan Apps Harassments Death: ఆగని లోన్ యాప్ వేధింపులు.. యువకుడు బలి
తదుపరి విచారణలో మిగిలిన నేరస్తుల పాత్రను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.లోన్ అప్ వేధింపులపై తక్షణం విచారణ చేసి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించమని, డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అడిషనల్ ఎస్పీ వెంకట రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెనమలూరు, అత్బుర పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి ప్రతిష్టాత్మకంగా స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఆధార్, పాన్ కార్డ్ సమాచారం ఇస్తే చాలు లోన్ గ్యారెంటీ అని వచ్చే నోటిఫికేషన్ల ను నమ్మి లోన్ తీసుకున్నారో ఇక అంతే. లోన్ ఆప్ సిబ్బంది ప్రాణం పోయినా వదిలే ప్రసక్తి లేదు. బంధువులు, స్నేహితులకు సైతం ఫోన్ చేసి వేధిస్తారు. అనధికారికంగా చలామణి అవుతున్న నకిలీ లోన్ ఆప్ లను నమ్మి ప్రజలు మోసపోవద్దని కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి తో నడపబడుతున్న బ్యాంకుల వద్ద నుండి సంబంధిత పత్రాలు సమర్పించి లోన్లు పొందాలని ఎస్పీ హితవు పలికారు.
Read Also: Swimming Tragedy: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!