Kakani Govardhan Reddy: మంత్రి కాకాణినీ వదలని లోన్ యాప్ సిబ్బంది.. 79 సార్లు కాల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App Agents Harassed Minister Kakani With 79 Phone Calls: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇప్పటివరకూ ఎందరో సామాన్య ప్రజలు బలయ్యారు. చివరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా వీరి వేధింపుల బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చేరిపోయారు. ఈయన్ను కూడా లోన్ యాప్ సిబ్బంది వదల్లేదు. తనకు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా.. ఏకంగా 79 సార్లు ఫోన్ చేసి విసిగించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి, పోలీసుల్ని ఆశ్రయించి, వారి ఆట కట్టించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. కాకాణి విషయంలో ‘అశోక్ కుమార్’ పేరుని వినియోగించారు.
‘‘అశోక్ కుమార్ లోన్ తీసుకొని కట్టట్లేదు. ప్రత్యామ్నాయంగా మీ నంబర్ ఇచ్చారు. ఆయన్ను అడిగితే, మీరు కడతారని చెప్తున్నారు. కాబట్టి.. తక్షణమే లోన్ డబ్బులు తిరిగి ఇచ్చేయండి’’.. ఇవి అనిల్ కుమార్ యాదవ్తో లోన్ రికవరీ ఏజెంట్లు మాట్లాడిన మాటలు. ‘నాకు అతనెవరో తెలియదు మొర్రో’ అని మంత్రి మొత్తుకుంటున్నా.. ‘డబ్బులు తినేసి కట్టకపోతే ఎలా’ అంటూ రివర్స్లో వాదించారు. ఇంకేముంది, ఆయనకు కోపమొచ్చి పోలీసుల్ని రంగంలోకి దింపారు. సరిగ్గా ఇదే సీన్ మంత్రి కాకాణి విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఇక్కడ కూడా అశోక్ కుమార్ పేరు చెప్పి, ఆయన తీసుకున్న లోన్ కట్టమని పదేపదే ఫోన్ చేశారు. లోన్తో ఎలాంటి సంబంధం లేదని కాకాణి పీఏ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. లోన్ కట్టాల్సిందేనంటూ కొన్ని గంటల వ్యవధిలోనే 79 కాల్స్ చేశారు. ఆ సమయంలో మంత్రి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఉన్నారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
దాంతో విసుగెత్తిపోయిన మంత్రి కాకాణి.. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. చెన్నైలోని కోల్ మేన్స్ సర్వీసెస్ అనే రికవరీ ఏజెన్సీ నుంచి కాల్స్ వచ్చినట్టు తేలింది. చెన్నైకు వెళ్లి, వారిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారిని విడిపించేందుకు ఏకంగా పది మంది ప్రముఖ న్యాయవాదులు వచ్చారు. అది చూసి తాను షాక్కు గురయ్యానని మంత్రి కాకాణి అన్నారు. ఏపీలో లోన్ యాప్ బ్యాచ్ల ఆటలు సాగకపోవడంతో.. చెన్నై నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. మంత్రిగా ఉన్న తననే వేధించారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థంచేసుకోవచ్చని అన్నారు. లోన్ యాప్ ముఠాను ఉచ్చులోకి లాగేందుకు, తన పీఏ ద్వారా రూ.25 వేలు చెల్లించినట్టు మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!