Kakani Govardhan Reddy: మంత్రి కాకాణినీ వదలని లోన్ యాప్ సిబ్బంది.. 79 సార్లు కాల్స్
Loan App Agents Harassed Minister Kakani With 79 Phone Calls: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇప్పటివరకూ ఎందరో సామాన్య ప్రజలు బలయ్యారు. చివరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా వీరి వేధింపుల బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చేరిపోయారు. ఈయన్ను కూడా లోన్ యాప్ సిబ్బంది వదల్లేదు. తనకు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా.. ఏకంగా 79 సార్లు ఫోన్ చేసి విసిగించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి, పోలీసుల్ని ఆశ్రయించి, వారి ఆట కట్టించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. కాకాణి విషయంలో ‘అశోక్ కుమార్’ పేరుని వినియోగించారు.
‘‘అశోక్ కుమార్ లోన్ తీసుకొని కట్టట్లేదు. ప్రత్యామ్నాయంగా మీ నంబర్ ఇచ్చారు. ఆయన్ను అడిగితే, మీరు కడతారని చెప్తున్నారు. కాబట్టి.. తక్షణమే లోన్ డబ్బులు తిరిగి ఇచ్చేయండి’’.. ఇవి అనిల్ కుమార్ యాదవ్తో లోన్ రికవరీ ఏజెంట్లు మాట్లాడిన మాటలు. ‘నాకు అతనెవరో తెలియదు మొర్రో’ అని మంత్రి మొత్తుకుంటున్నా.. ‘డబ్బులు తినేసి కట్టకపోతే ఎలా’ అంటూ రివర్స్లో వాదించారు. ఇంకేముంది, ఆయనకు కోపమొచ్చి పోలీసుల్ని రంగంలోకి దింపారు. సరిగ్గా ఇదే సీన్ మంత్రి కాకాణి విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఇక్కడ కూడా అశోక్ కుమార్ పేరు చెప్పి, ఆయన తీసుకున్న లోన్ కట్టమని పదేపదే ఫోన్ చేశారు. లోన్తో ఎలాంటి సంబంధం లేదని కాకాణి పీఏ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. లోన్ కట్టాల్సిందేనంటూ కొన్ని గంటల వ్యవధిలోనే 79 కాల్స్ చేశారు. ఆ సమయంలో మంత్రి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఉన్నారు.
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
దాంతో విసుగెత్తిపోయిన మంత్రి కాకాణి.. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. చెన్నైలోని కోల్ మేన్స్ సర్వీసెస్ అనే రికవరీ ఏజెన్సీ నుంచి కాల్స్ వచ్చినట్టు తేలింది. చెన్నైకు వెళ్లి, వారిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారిని విడిపించేందుకు ఏకంగా పది మంది ప్రముఖ న్యాయవాదులు వచ్చారు. అది చూసి తాను షాక్కు గురయ్యానని మంత్రి కాకాణి అన్నారు. ఏపీలో లోన్ యాప్ బ్యాచ్ల ఆటలు సాగకపోవడంతో.. చెన్నై నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. మంత్రిగా ఉన్న తననే వేధించారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థంచేసుకోవచ్చని అన్నారు. లోన్ యాప్ ముఠాను ఉచ్చులోకి లాగేందుకు, తన పీఏ ద్వారా రూ.25 వేలు చెల్లించినట్టు మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!