శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ లైవ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. గెలుపు ఏకపక్షమే అయినప్పటికీ ప్రతిపక్షంగా వున్న బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్కు అధికారులు అనుమతిచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. సాయంత్రం 5:30 గంటల వరకు ఆత్మకూరులో 2.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు ఓటు వేసే అవకాశం ఉందన్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ మందకొడిగా సాగుతోందని తెలిపారు. ఏ.ఎస్ పేటలో పోలింగ్ సరళిని వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పరిశీలించారు.
మర్రిపాడు(మ) కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలోని బీజేపీ ఏజెంట్ విష్ణువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వైసీపీ నేత మేకపాటి రాజారెడ్డి, ఆయన అనుచరులు. తిమ్మానాయుడు పల్లె వద్ద కారును అడ్డుకుని ఏజెంట్ విష్ణువర్ధన్ రెడ్డిని విడిపించిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్. పోలీసులకు ఫిర్యాదు చేసిన భరత్ కుమార్.
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మర్రిపాడు(మ) తిమ్మా నాయుడు పల్లెలో తొమ్మిదో నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ లోపల బీజేపీ ఏజెంట్లను బెదిరించిన వైసీపీ అభ్యర్థి బాబాయ్ రాజారెడ్డి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్-రాజారెడ్డి-ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డ బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 శాతం ఓటింగ్ నమోదయింది. గంటకు సరాసరి 8 శాతం చొప్పున నమోదవుతుది పోలింగ్. ఇదే విధంగా పోలింగ్ కొనసాగితే సాయంత్రానికి 70 నుంచి 80శాతం పోలింగ్ జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా సంగం పోలింగ్ కేంద్రానికి పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు కలెక్టర్ చక్రధర్ బాబు. 141 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పరిశీలించి పోలింగ్ స్టేషన్స్ అనుమతి ఇస్తున్నాం. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూమ్స్ కి చేరుస్తాం. కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు .
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలలో పోలింగ్ పుంజుకుంది. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. అనంత సాగరం, ఆత్మకూరు, చేజర్ల, ఏ.ఎస్.పేట.మండలాల్లో కలెక్టర్ తో పాటు ఎన్నికల పరిశీలకుడు సురేష్ కుమార్ పర్యటించారు. పోలింగ్ తీరు పై ఆరా తీశారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇప్పటివరకూ 45 శాతం పోలింగ్ నమోదైందని పోలింగ్ అధికారులు తెలిపారు.
ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం పోలింగ్ కేంద్రంలో వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్ధుల వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ప్రచారం చేస్తున్నారని ఆందోళన. ఏజెంట్గా ఉంటూ ప్రచారం చేస్తున్నారని అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థులు.