Leopard : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం.. విద్యార్థుల్లో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేగింది. వర్శిటీ పరిపాలనా భవనం వద్ద కుక్కలపై చిరుత దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు వర్శిటీ సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వర్సిటీకి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుత సంచరించిన పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఐతే ఆరు నెలలుగా ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని, రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయని విద్యార్థులు అంటున్నారు.
Read Also: Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అయితే, తిరుపతి సమీప ప్రాంతాలల చిరుత పులుల సందడి పెరుగుతుంది.. రోజూ ఎదో ఒకచోట చిరుతు పులుల అలజడులు సర్వసాధారణంగా మారింది .. దానికి ఇటీవల కాలంలో వరుసగా జరుగుతూ దాడులు ఉదాహరణగా చేబుతున్నారు అటవీశాఖ అధికారులు .. శేషచలం కొండల కేంద్రం తిరుమలలో వరుసగా చిరుతలు హల్ చల్ చేస్తుంటే… కొండ కింద తిరుపతిలో అదే పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ పరిపాలన భవనం ఆవరణలో నిన్న అర్ధరాత్రి చిరుత సంచరించింది. అక్కడ నిద్రిస్తున్న ఓ శునకాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిన్న అర్ధరాత్రి సంచరించిన చిరుత జాడను ఇవాళ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది… యూనివర్సిటీ వద్దకు చేరుకొని చిరుత జాడలను గుర్తించారు. మరోసారి చిరుత యూనివర్సిటీ ఆవరణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట యూనివర్సిటీలోని ఆవరణలో, సమీపంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడం స్ధానికులు గమనించారు. అప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అదే రోజు యూనివర్సిటీలోని ఓ శునకంపై దాడి చేసి గాయ పరచడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.
తాజావార్తలు
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!