Gangadhara Nellore Land Mafia: ల్యాండ్ మాఫియా మాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి,
ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు మీద తన బంధువుల పేరు పైన సుమారు 60 ఎకరాలు రెవెన్యూ పాసుబుక్లు స్వంతంగా తయారు చేసుకుని వాటిని ఆన్లైన్ లోకి ఎక్కించి వాటిని వివిధ బ్యాంకులలో పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. తనకు కావాల్సిన బంధుగణానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవ్వడం, ఎదురు తిరిగిన వారిపై వైసీపీ పేరు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా బెదిరించడం చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
అతని పేరు చెబితే రెండు మండలాల రైతులు గజగజా వణుకుతారు. కొద్దిగా ఆర్థికంగా ఉండి చదువు రాకుండా ఉంటే చాలు అంతే ఈ నాగార్జున రెడ్డి గ్యాంగ్ వారి పొలాలపై పాసుబుక్కులు సృష్టించి ఆన్లైన్లో ఉన్న పేర్లను తొలగించి వీళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్లు నమోదు చేయించేస్తాడు, ప్రభుత్వ భూమి గుట్టలు ,చెరువులను సైతం కొనుగోలు కింద సృష్టిస్తాడు. వీరి బాధితులు కోకొల్లలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టికి తీసుకొని వెళ్లగా నా చేతిలో ఏమీ లేదని బహిరంగంగానే తిప్పి పంపుతున్నా. బాధితులు చాలామంది వున్నారంటూ స్వయంగా డిప్యూటీ నారాయణస్వామి చెప్పడంతో రైతులు నోరెళ్లబెట్టారు, కొంతమంది రైతులు ధైర్యం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించి, తమ నిరసనను తెలియజేసారు, ఎమ్మార్వో స్పందిస్తూ ఫిర్యాదు రూపంలో అందజేయండి పదిరోజుల్లో మీకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!