Gangadhara Nellore Land Mafia: ల్యాండ్ మాఫియా మాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి,
ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు మీద తన బంధువుల పేరు పైన సుమారు 60 ఎకరాలు రెవెన్యూ పాసుబుక్లు స్వంతంగా తయారు చేసుకుని వాటిని ఆన్లైన్ లోకి ఎక్కించి వాటిని వివిధ బ్యాంకులలో పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. తనకు కావాల్సిన బంధుగణానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవ్వడం, ఎదురు తిరిగిన వారిపై వైసీపీ పేరు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా బెదిరించడం చేస్తున్నారు.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
అతని పేరు చెబితే రెండు మండలాల రైతులు గజగజా వణుకుతారు. కొద్దిగా ఆర్థికంగా ఉండి చదువు రాకుండా ఉంటే చాలు అంతే ఈ నాగార్జున రెడ్డి గ్యాంగ్ వారి పొలాలపై పాసుబుక్కులు సృష్టించి ఆన్లైన్లో ఉన్న పేర్లను తొలగించి వీళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్లు నమోదు చేయించేస్తాడు, ప్రభుత్వ భూమి గుట్టలు ,చెరువులను సైతం కొనుగోలు కింద సృష్టిస్తాడు. వీరి బాధితులు కోకొల్లలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టికి తీసుకొని వెళ్లగా నా చేతిలో ఏమీ లేదని బహిరంగంగానే తిప్పి పంపుతున్నా. బాధితులు చాలామంది వున్నారంటూ స్వయంగా డిప్యూటీ నారాయణస్వామి చెప్పడంతో రైతులు నోరెళ్లబెట్టారు, కొంతమంది రైతులు ధైర్యం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించి, తమ నిరసనను తెలియజేసారు, ఎమ్మార్వో స్పందిస్తూ ఫిర్యాదు రూపంలో అందజేయండి పదిరోజుల్లో మీకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!