NTV Telugu Site icon

శ్రీ‌శైల మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్.. నేటి నుంచి…

Srisailam

శ్రీశైల మల్లన్న భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. ఇవాళ్టి నుంచి భక్తులకు సర్వ దర్శనాలు క‌ల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. అయితేచ‌, క‌రోనా నిబంధనలు పాటించాల్సిందేన‌ని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్‌లైన్‌, కరెంటు బుకింగ్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని ఈవో వెల్ల‌డించారు..

ఇక‌, ఆర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి ఆర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగనున్నాయి. బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి 7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాల‌ని…. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు.