Deputy CM Pawan: నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడొద్దు..
- లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాం..
- నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన వేరే మతాలు ఇబ్బంది పడొద్దు..
- సనాతన ధర్మాన్ని పటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా: డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షా 55 వేల నీటి కుంటలు మే ఆఖరులోగా లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.. రాయలసీమ రతనాల సీమ కావాలి.. అభివృద్ధి కొందరికే కాకుండా అందరికి కావాలని తెలిపారు. ఒకే రోజు 13,320 గ్రామ సభలు నిర్వహించాం.. అభివృద్ధిలో చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తున్నాం.. 16 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాం.. ఇజ్రాయెల్ ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది.. నీటి కుంటలు సద్వినియోగం చేసుకుంటే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు వినియోగించుకోవాలి.. నా ఫారంలో నీతికుంటలు తవ్వుకున్నాను.. పాలేకర్ వ్యవసాయ విధానం అనుసరించాలి.. ఓజిలో హీరోలా కాకుండా సగటు రైతులా మాట్లాడుతున్నారు.. ఉపాధి దొరక్కపోతే, సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకుంటే నేను నర్సరీలో పని చేయాలనుకున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: IPL : ఐపీల్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్.. కారణం ఏంటంటే.?
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
ఇక, రైతు కష్టపడతాడు, సరైన వనరులు ఉపయోగించుకోకుంటే కష్టం వృథా అవుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను.. అసమానతలను వెతుక్కోను, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా.. సనాతన ధర్మాన్ని పటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కర్నూలు ఎయిర్ పోర్ట్ కి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పేరు పెడతామన్నారు. ఇక, బుడగ జంగాలకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.. అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను.. త్వరలోనే వారికి న్యాయం చేస్తాను అని వెల్లడించారు. నందికొట్కూరు నియోజకవర్గం కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో చెప్పాను.. నా ట్రస్ట్ ద్వారా రూ.50 లక్షలు ఇస్తా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కొణిదెల గ్రామంలో అమలు చేస్తా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా.. టెంట్ వేసి అక్కడే రెండు మూడు రోజులు ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.