CI Serious On TDP Protest: ఎంపీ మాధవ్ తరహాలో మీ వాళ్లు చేయలేదా? దుమారం రేపుతున్న సీఐ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CI Serious On TDP Protest: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు శనివారం నాడు కుప్పంలో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకుని దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. దీంతో టీడీపీ నేతలు, కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ అనుమతి లేకుండా దిష్టిబొమ్మను ఎలా దహనం చేస్తారని చంద్రబాబు పీఏ మనోహర్ను సీఐ శ్రీధర్ ప్రశ్నించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తే తప్పేంటని, ఎందుకు అడ్డుకుంటున్నారని మనోహర్ సీఐను నిలదీశారు. ఎంపీ మాధవ్ మీ స్నేహితుడు అని అడ్డుకుంటున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.
Read Also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
అయితే సీఐ శ్రీధర్ స్పందిస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్ తన స్నేహితుడు కాదని, పోలీసుల విధుల్లో భాగంగానే అడ్డుకుంటున్నట్టు వివరించారు. న్యూడ్ వీడియోలు చేసేవాళ్లు చాలామందే ఉంటారని.. మీరు చేయలేదా అంటూ టీడీపీ నేతలను సీఐ శ్రీధర్ ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ తప్పు చేశారని తేలితే చట్టబద్ధంగా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. అయినా తప్పు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా? దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి అంటూ సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు చేశార. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు పీఏ మనోహర్ సహా 15 మంది టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా దేశాన్ని కాల్చండి అంటూ సీఐ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కాగా సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు అని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!