Farmers High Alert: గుట్టలు, గుట్టలుగా ధాన్యపు రాశులు.. ఆందోళనలో రైతులు!
- దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు..
- రైతులకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు..
- గుట్టలు, గుట్టలుగా ధాన్యపు రాశులతో ఆందోళనలో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers High Alert: దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మండల స్థాయి అధికారులకు సైతం సూచనలు జారీ చేశారు. పండించిన ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే, గోనె సంచులు లేని రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇచ్చే సంచులు తక్కువగా ఉండటం, మిల్లర్లు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ అయిపోయిందని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
Read Also: డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్ లైనప్లో భారీ మార్పులు.. డిసెంబర్ 10న కొత్త తరం Kia Seltos వచ్చేస్తుంది..!
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
అయితే, కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 3.70 లక్షల ఎకరాల వరి సాగు జరగగా, అందులో 60 శాతం కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి. పంట చేతికి వచ్చే సమయానికి దిత్వా తుఫాన్ ఎఫెక్టుతో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర దిగుబడి కూడా రాలేదని అంటున్నారు. మరో రెండు రోజులు వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ డబ్బులు చెల్లించి వరి కోతలు చేయించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
Read Also: REDMI 15C 5G Lunch: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. 10 వేలకే రెడ్మీ నుంచి పవర్ ఫుల్ ఫోన్!
ఇక, అధికారులు మాత్రం కార్యాలయాల్లో కూర్చొని సమావేశాలు నిర్వహించడమే తప్ప తమ దగ్గరు వచ్చి సమస్యలు తెలుసుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. గోనె సంచులు వేల సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయనే ప్రకటనలు చేస్తున్నారు తప్పా.. తమకు మాత్రం అందజేయడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో గుట్టలు, గుట్టలుగా ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!