Kodali Nani: ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్ధర్కి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
Kodali Nani Strong Counter To AP BJP Incharge Sunil Deodhar: తనపై ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్ధర్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సునీల్ దేవ్ధర్ ఒక పకోడీ అని.. అతనిలాంటి పకోడీల వల్లే కర్ణాటకలో బీజేపీ దిగజారిందని విమర్శించారు. సునీల్ లాంటి వాళ్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న సునీల్ లాంటి నేతలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే.. కర్ణాటకలో వచ్చిన పరిస్థితే ఇతర రాష్ట్రాల్లో వస్తుందని హెచ్చరించారు.
NTR 30: సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి..
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
కాగా.. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో కొడాలి నానిపై సునీల్ దేవ్ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యాడని, అంతకుమించి ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతోందని అన్నారు. గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నాడని, అతడ్ని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని పిలుపునిచ్చారు. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగను ఆయన క్యాసినో, క్యాబిరే డ్యాన్స్లుగా మార్చేశారని ఆరోపించారు. ఏపీలో తమ బీజేపీ అధికారంలోకి వస్తే.. కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని అన్నారు. ఇలా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను.. కొడాలి నాని పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వంపై కూడా సునీల్ దేవ్ధర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. శిక్ష పడిన ఖైదీ, బూతుల ఎమ్మెల్యేల పాలనలో ఏపీ సర్వనాశనం అయ్యిందని.. అవినీతిమయమైన జగన్ పాలనని అంతం చేసేందుకు జనసేనతో కలిసి బీజేపీ పోరాడుతుందని అన్నారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి ఉండే.. జగన్ పాలనలో అంతకుమించిన వేడితో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్కు పంపుతున్నారని.. ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలదే ఏపీలో రాజ్యం నడుస్తోందని.. ఆలీబాబా 40 దొంగలు మాదిరి జగన్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!