Thota Trimurthulu: మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు తీసుకెళ్లిన కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Points In Thota Trimurthulu And Mithun Reddy Meetings: రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎంత వాడీవేడీగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ సంచలన ప్రకటన చేస్తే.. సీఎం జగన్ ఉన్నంతకాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరు నేతలు తగ్గేదే లే అన్నట్టుగా ఉండగా.. వీరి ఎపిసోడ్లో తాజాగా అనుకోని ట్విస్ట్ వెలుగు చూసింది. గతంలో రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు.
Pawan Kalyan: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో భాగంగా మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని తోట తెలిపారు. ఇంతకుముందు పిల్లి సుభాష్, తాను రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసినా.. నియోజకవర్గానికి కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్తే ఏదో అవుతుందని కాదని.. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను వెళ్తే, తన వర్గానికి చెందిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారని, అందుకే వెనక్కి తగ్గుతున్నానని తెలిపారు. వ్యవహారం ఇలాగే ఉంటే.. రేపు తాను చెప్పినా, ఓటు వేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ
రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని తోట త్రిమూర్తులు వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఈనెల 26వ తేదీన జగన్ అమలాపురం పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి.. ఈ దశలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!