Thota Trimurthulu: మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు తీసుకెళ్లిన కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Points In Thota Trimurthulu And Mithun Reddy Meetings: రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎంత వాడీవేడీగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ సంచలన ప్రకటన చేస్తే.. సీఎం జగన్ ఉన్నంతకాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరు నేతలు తగ్గేదే లే అన్నట్టుగా ఉండగా.. వీరి ఎపిసోడ్లో తాజాగా అనుకోని ట్విస్ట్ వెలుగు చూసింది. గతంలో రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు.
Pawan Kalyan: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు
Also Read
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో భాగంగా మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని తోట తెలిపారు. ఇంతకుముందు పిల్లి సుభాష్, తాను రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసినా.. నియోజకవర్గానికి కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్తే ఏదో అవుతుందని కాదని.. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను వెళ్తే, తన వర్గానికి చెందిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారని, అందుకే వెనక్కి తగ్గుతున్నానని తెలిపారు. వ్యవహారం ఇలాగే ఉంటే.. రేపు తాను చెప్పినా, ఓటు వేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ
రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని తోట త్రిమూర్తులు వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఈనెల 26వ తేదీన జగన్ అమలాపురం పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి.. ఈ దశలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!