Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. అడపడుచులకు డిప్యూటీ సీఎం అదిరిపోయే గిఫ్ట్లు..
- తన నియోజకవర్గంలోని ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుమతులు..
- ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు..
- 12 వేల చీరలను ఆడపడుచులకు పంపించిన పవన్ కల్యాణ్..
- పురూహూతికా దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలు..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది.. దానికి అనుగుణంగా.. పవన్ కల్యాణ్ కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే.. నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్.. అయితే, ప్రతీ ఏడూ శ్రావణమాసం చివరి శుక్రవారం రోజున పిఠాపురంలోని పురూహూతికా దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు.. అదే కోవలో ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేయగా.. తాను గెలిచిన తర్వాత వచ్చిన తొలి ఈవెంట్ కాబట్టి.. అందరికీ అదిరిపోయే గిఫ్ట్లు పంపారు పవన్ కల్యాణ్..
Read Also: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్డేట్.. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే!
Also Read
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
- Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
అయితే, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశానుసారం సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పాస్ లు జారీ చేయడం గందరగోళంగా తయారయ్యింది అంటున్నారు.. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాదగయలో జరిగే వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే వారందరికి అందించేందుకు వీలుగా 12వేల చీరలను పంపించినట్లు జనసేన వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.. ఈ నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాద గయ క్షేత్రానికి టోకెన్లు కోసం మధ్యాహ్నం నుండి బారులు తీరారు.. అయితే పాదగయలో ఆరువేల మందికి మాత్రమే వ్రతాలు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.. వరలక్ష్మి వ్రతాలకు కేవలం ఎనిమిది వందల నుండి వెయ్యి టికెట్లు వరకు ఆలయ సిబ్బంది జారీ చేసి చేతులెత్తేశారు.. టోకెన్లు కోసం మహిళలలు 5 వేలకు పైగా రావడం, టోకెన్లు మాత్రం నామమాత్రంగా జారీచేయడంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు.. అంతా గందరగోళంగా మారడంతో స్థానికుల్లో ఆగ్రహాన్ని తెచ్చింది. 12 వేలు వ్రతాలకు సంబంధించి చీరలు, పూజ సామాన్లు పంపిణీ కి సిద్ధం చేశామని చెప్పగా , నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉదయం 9గంటలకే వచ్చి క్యూలైన్లుల్లో నిలుచున్నామని. వర్షానికి తడస్తూ, ఉక్కపోతతో సతమవుతూ అయిదు గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని.. అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా టోకెన్లు జారీ చేసి చేతులు ఫులుపుకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా నామమాత్రమేనని.. అన్ని సద్దుకుంటాయని.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు విజయవంతంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!