Kakani Govardhan Reddy: మంత్రిగా తొలి సంతకం ఏ ఫైలుపై పెట్టారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించామని తెలిపారు. సీఎం జగన్ రైతుపక్షపాతి అని పేర్కొన్నారు.
రూ. 20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకు నగదు బదిలీ చేసినట్లు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెల్లడించారు. గన్నవరం స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించామని.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేశామని తెలిపారు. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
మరోవైపు సచివాలయంలో గిరిజన శాఖ మంత్రిగా రాజన్నదొర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థకు సంబంధించి కారుణ్య నియామకాల ఫైలుపై తొలి సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశీయ కోళ్లు పెంపకానికి సంబంధించిన ఫైలుపైనా సంతకం చేసినట్లు వివరించారు. ఒక గిరిజనుడికి సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని కొనియాడారు. గిరిజన శాఖా పరంగా ప్రమోషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని.. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొండలు ఎక్కడానికి రోడ్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల సంఘం తన నియోజకవర్గంలో ఒక గర్భిణీ రోడ్డుపై ప్రసవమైన విషయాన్ని సీరియస్గా తీసుకుందన్నారు. ఈ మేరకు కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్ అనుమతులిచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది గిరిజనులు ఉన్నారని.. 50 మండలాలలో గిరిజన జనాభా విస్తరించిందని మంత్రి రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధులను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!