Kadapa Muslim Bhakthulu: దేవుని కడపలో ముస్లింల ఉగాది పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశం మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. పండుగ ఏదైనా.. ఉగాది అయినా, రంజాన్ అయినా, క్రిస్ట్ మస్ అయినా,, ప్రజలంతా సమైక్యంగా జరుపుకుంటారు. హిందువులకు ముస్లింలు శుభాకాంక్షలు చెబుతారు. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవిస్తారు. హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవుని కడప దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. అక్కడ తెలుగు వారి తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని హిందువులే కాదు.. ముస్లింలు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీనివాసునికి కాయ కర్పూరం సమర్పించి, ఇక్కడి పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇందుకోసం ముస్లింలు స్వామివారిని దర్శించుకోవడం దేవుని కడపలో ఉగాది పండుగ ప్రత్యేకత.
Read Also: Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి, కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే దేవుని కడప ఆలయానికి చేరుకుని, కాయకర్పూరం సమర్పించి, ముడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు. ఉగాది రోజున వేంకటేశ్వరుడిని దర్శించి, ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పించి, ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు.

చూసేవారికి కొత్తగా అనిపించినా, తమ బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నాడరన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో, ప్రీతి పాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని, కొందరు ముస్లింలు చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది. పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆలయం మతసామరస్యాన్ని చాటుచెబుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Read Also: 2023 Ugadi Panchanga Sravanam Live: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రిగారి ఉగాది పంచాంగ శ్రవణం
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!