సామాజిక న్యాయానికి సీఎం జగన్ ప్రతిరూపం-జూపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి సవాంగ్ ను పట్టుకొని టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.. గతంలో సవాంగ్ ను డీజీపీ కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించిన జూపూడి.. డీజీపీపై టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు..
చంద్రబాబు, లోకేష్ కు బుర్రలేదు.. టీడీపీలో మిగతా నేతలకు ఏమైంది అంటూ హాట్ కామెంట్లు చేశారు జూపూడి ప్రభాకర్.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్న ఆయన.. సీఎం చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు.. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యున్నతస్థాయి పదవులు ఇస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు 70 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలు ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని.. ఎస్సీలకు 25 వేల కోట్లు, ఎస్టీలకు 7114 కోట్లు, మైనార్టీలకు 7118 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఖర్చు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న జూపూడి.. సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు ఉరేసుకుని చావాలన్నారు. ఎస్సీలకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు జూపూడి ప్రభాకర్.
Also Read
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?