NTV Telugu Site icon

JC Prabhakar Reddy: అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారు.. జేసీ వార్నింగ్‌

Jc

Jc

JC Prabhakar Reddy: జేసీ ట్రావెల్స్‌పై పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తప్పుడు సమాచారం ఇచ్చి, ఫోర్జరీలకు పాల్పడ్డారని.. రవాణా శాఖ ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసులు పెట్టారు.. తాజాగా మరో వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. నకిలీ ఇన్సూరెన్స్ లు పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్లు చేశారు? అని ప్రశ్నించారు.. దానికి అదనంగా కేసులు పెట్టారు.. కేవలం పేపర్లు ఇస్తే రిజిస్ట్రేషన్లు ఎలా? చేస్తారు అని నిలదీశారు.. 28 వాహనాలకు వందకు పైగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. డీటీ కి అసలు కేసులు పెట్టే అధికారం లేదు.. కానీ, ఆయనపై ఒత్తిళ్లు చేశారు.. కేసులు పెట్టించారని ఆరోపించారు..

Read Also: Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..

అయితే, మొత్తం అధికారులంతా ఈ కేసుల్లో ఇరుక్కుంటారు అంటూ హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు జేసీ… పెద్దారెడ్డి ఒక పిచ్చోడు అని మండిపడ్డారు.. ఇక, ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్ లు, గుర్రాల రేస్ లు చేసుకో.. అది కూడా కాకపోతే నీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు చేసుకో.. అంతే కానీ, ప్రతీ విషయంలో మమ్మల్ని టార్గెట్‌ చేయొద్దని హితవుపలికారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కాగా, తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి‌పై మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కూలం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.. దీంతో, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెద్దపప్పూరు పోలీసుస్టేషన్‌లో పెద్దపప్పూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది..