Nadendla Manohar: వ్యక్తిగతంగా నష్టపోయినా పవన్ కల్యాణ్ పోరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన.. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ముందు నిండు మనస్సుతో సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామన్న రైతులు.. కాసేపటికే స్థలం ఇవ్వలేమని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారన్నారు.. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు మనోహర్.
Read Also: AP Capital: ఒకటికి 10 సార్లు చెబుతున్నాం.. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం..
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
ఇక, వైఎస్ జగన్ పాలనపై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించుకోవాలని సూచించారు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వంలో చాలా మంది అహంకారంతో పని చేస్తున్నారన్న ఆయన.. ప్రజలు నిండు మనస్సుతో 151 సీట్లు ఇస్తే.. పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు.. చాలా మంది పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శించారు. మరోవైపు, అమరావతిపై హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు మనోహర్.. ఓ ఉద్యమ గళాన్ని వినిపించకుండా చేయాలనుకున్న ప్రభుత్వ పిచ్చి భ్రమను కోర్టు తన తీర్పుతో తొలగించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో ఏపీ చాలా నష్టపోయిందన్న ఆయన.. ప్రభుత్వం రాజధాని రైతులను ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. ఇక, అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపిన ఆయన.. ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారో మీరే చూస్తారు.. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారోననేది స్పష్టం చేస్తారని తెలిపారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతోందో స్పష్టంగా చెబుతామన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జగన్ నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ అంటున్నారు.. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు.. కానీ, సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శలు గుప్పించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..