Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- 25 లక్షల సభ్యత్వాలే జనసేన కొత్త లక్ష్యం
- ఇప్పటికే 21.5 లక్షల సభ్యత్వాలు పూర్తి
- కార్యకర్తల కుటుంబాలకు రూ.46 కోట్ల సాయం
- స్థానిక ఎన్నికలపై నాదెండ్ల ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేవలం ఒక సంఖ్య కాదని, అది పార్టీ విలువలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జనసైనికులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని, పార్టీ ఇస్తున్న భరోసాను ఆయన వివరించారు.
పార్టీ సభ్యత్వ నమోదుపై నాదెండ్ల మనోహర్ కీలక గణాంకాలను వెల్లడించారు. 2024 ఎన్నికల తర్వాత జనసైనికులు ఎంతో బలంగా నిలబడి 12 లక్షల 12 వేల సభ్యత్వాలు చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది పార్టీ 25 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకోగా, క్షేత్రస్థాయిలో జనసైనికుల కృషి వల్ల ఇప్పటికే 21 లక్షల 50 వేల సభ్యత్వాలు పూర్తి కావడం విశేషమని ఆయన కొనియాడారు. ఏటా సభ్యత్వాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనోహర్ భరోసా ఇచ్చారు. “2020లో సభ్యత్వ నమోదు ప్రారంభించినప్పటి నుండి దురదృష్టవశాత్తూ 1,034 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. పార్టీ సభ్యత్వం ఉండి మరణించిన వారందరికీ కలిపి ఇప్పటి వరకు రూ. 46 కోట్ల 35 లక్షలను చెక్కుల రూపంలో వారి కుటుంబాలకు అందజేశాం” అని ఆయన వివరించారు. రాజకీయాల్లో కష్టాలు, సమస్యలు సహజమని, కానీ జనసేన ఎప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
పార్టీలో వర్గాలు లేదా భిన్న నాయకత్వాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “జనసేనలో ఎలాంటి వర్గాలు లేవు. మనందరికీ ఉన్నది పవన్ కళ్యాణ్ నాయకత్వం ఒక్కటే. నిజాలు తెలుసుకోకుండా ఎవరూ తొందరపడి మాట్లాడవద్దు” అని సూచించారు. పార్టీ కోసం వీరమహిళలు, జనసైనికులు ఎంతో ధైర్యంగా నిలబడ్డారని, వారి కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జనసైనికులు ఒక అవకాశంగా తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మన ముందు ఉందని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడమే మన లక్ష్యం కావాలని కోరారు. ఏ రోజూ స్వార్థం కోసం పని చేయని జనసైనికుల కృషితో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..