సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ సాగుతోంది.. సీఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇక, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నమాట.. ఇక, రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమం పేరుతో రాష్ట్రానికి అభివృద్ధిని దూరం చేశారని ఆరోపించారు.. నవరత్నాలు ప్రజలకు అందని ద్రాక్ష లా మిగిలాయన్న ఆయన.. ఎన్నికల కోసం హడావుడి చేసే పార్టీ జనసేన కాదన్నారు. 14న జరిగే భారీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచి అవుతుంది తెలిపిన నాదెండ్ల.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.. ఎన్నికలలో ఒంటరిగా ఉండాలని లేదు.. కానీ, జనసేన సిద్ధాంతాలతో కలసి వచ్చే వారితో భవిష్యత్ వ్యూహాలు ఉంటాయన్నారు.
Read Also: Congress: ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామా..?