Site icon NTV Telugu

రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్‌ రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. తొలిరోజు వైయస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు.

ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ జగన్‌ పర్యటించనున్నారు. రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

Exit mobile version