Jawan Rajasekhar Last Rites: అమరజవాన్ రాజశేఖర్కు అంతిమ వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలో అమర జవాన్ రాజశేఖర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 16న జమ్ముకాశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలో అన్నమయ్య జిల్లాకు చెందిన తెలుగు జవాన్ మృతి చెందాడు. ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన దేవరింటి రాజశేఖర్ (34) అనే ఆర్మీ జవాన్ మృతి చెందిన విషయం తెలిసిందే… ఆర్మీ జవాన్ రాజశేఖర్ మృతదేహాన్ని ఐటిబిపి అధికారులు స్వగ్రామైన దేవపట్లకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, 53వ ఐటిబిపి బెటాలియన్ డిప్యూటీ కమాండెటర్ ఆయూస్ దీపక్ లు జవాన్ రాజశేఖర్ స్వగృహానికి చేరుకొని ఆర్మీ జవాన్ రాజశేఖర్ భౌతిక గాయాన్ని సందర్శించి పుష్ప గుచ్చాలు ఉంచి శ్రధ్దాంజలి ఘటించారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్మీ జవాన్ రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటుందని, రెండు రోజుల్లో పరిహారం చెక్కును అందజేస్తామని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ వెల్లడించారు. సంబేపల్లి మండల కేంద్రం నుండి దేవపట్ల వరకు అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర నిర్వహించారు.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
జవాన్ అంతిమ యాత్రలో సంబేపల్లె, దేవపట్ల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలుచుని అడుగడుగునా పూలు చల్లుతూ జై జవాన్, అమర్ రహే రాజశేఖర్ అంటూ సెల్యూట్ చేస్తూ నినాదాలు చేశారు. అంతిమ యాత్ర అనంతరం స్వగ్రామైన దేవపట్లలో ఆర్మీ జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు సైనిక్, ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జవాన్ పార్థివ దేహంపై ఆర్మీ అధికారులు ఉంచిన జాతీయ జెండాను జవాన్ రాజశేఖర్ భార్య ప్రమీలకు ఆర్మీ అధికారులు అందజేశారు. ఐటిబిపి, ఏపీ పోలీసులు ఆర్మీ జవాన్ రాజశేఖర్ పార్ధవదేహం వద్ద నిలబడి గౌరవవందనం చేసి గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంబేపల్లె తహశీల్దార్ దగ్గర ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. రాయచోటి రూరల్ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో సంబేపల్లె ఎస్ఐ మహమ్మద్ షరీఫ్, పోలీసు సిబ్బంది బందోబస్తును నిర్వహించారు.
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!