బీఏసీలో ఆసక్తికర చర్చ.. చంద్రబాబు మొహం చూడాలని ఉంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.. గెలుపు ఓటముల నుంచి.. మొహాలు చూసుకునే వరకు.. మీరు ఓడారంటే.. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా సేపే చర్చ సాగింది.. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా… సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, గెలుపోటములు సర్వ సాధారణమేనని బదులిచ్చిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు.. ఇదే సమయంలో చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు..
Read Also: ఏ4 సైజు పేపర్ వినియోగంపై హైకోర్టులో విచారణ
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
మరోవైపు.. నెల్లూరులో అచ్చెన్న ఇంఛార్జ్గా ఉన్నారని గుర్తుచేశారు మంత్రి అనిల్ కుమార్.. దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. అయితే, సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారట.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం అంటే.. కుప్పంలో ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసు అంటూ అచ్చెన్న బదులు ఇచ్చారు.
ఇక, ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించగా.. చాలా సమస్యలున్నాయి.. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ కోరింది.. కోవిడ్ సమయంలో సభను ఆన్ లైన్ ద్వారా నడపాలని గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా? అని ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తుచేయగా.. గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకుంటే ఎలా అని అంటూ ఈ నెల 26వ తేదీ వరకు సభ జరుపుదామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని సీఎం జగన్ సూచనలు చేశారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దానికి పెద్ద హడావుడెందుకు లిమిటెడ్గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని తెలిపారు.. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం ఓ చరిత్రేనని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. ఇలా.. ఎన్నికల ఫలితాల నుంచి సభ నిర్వహణ వరకు బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.
- Tags
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో