బీఏసీలో ఆసక్తికర చర్చ.. చంద్రబాబు మొహం చూడాలని ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.. గెలుపు ఓటముల నుంచి.. మొహాలు చూసుకునే వరకు.. మీరు ఓడారంటే.. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా సేపే చర్చ సాగింది.. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా… సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, గెలుపోటములు సర్వ సాధారణమేనని బదులిచ్చిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు.. ఇదే సమయంలో చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు..
Read Also: ఏ4 సైజు పేపర్ వినియోగంపై హైకోర్టులో విచారణ
Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
మరోవైపు.. నెల్లూరులో అచ్చెన్న ఇంఛార్జ్గా ఉన్నారని గుర్తుచేశారు మంత్రి అనిల్ కుమార్.. దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. అయితే, సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారట.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం అంటే.. కుప్పంలో ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసు అంటూ అచ్చెన్న బదులు ఇచ్చారు.
ఇక, ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించగా.. చాలా సమస్యలున్నాయి.. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ కోరింది.. కోవిడ్ సమయంలో సభను ఆన్ లైన్ ద్వారా నడపాలని గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా? అని ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తుచేయగా.. గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకుంటే ఎలా అని అంటూ ఈ నెల 26వ తేదీ వరకు సభ జరుపుదామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని సీఎం జగన్ సూచనలు చేశారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దానికి పెద్ద హడావుడెందుకు లిమిటెడ్గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని తెలిపారు.. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం ఓ చరిత్రేనని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. ఇలా.. ఎన్నికల ఫలితాల నుంచి సభ నిర్వహణ వరకు బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.
- Tags
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!