బీఏసీలో ఆసక్తికర చర్చ.. చంద్రబాబు మొహం చూడాలని ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.. గెలుపు ఓటముల నుంచి.. మొహాలు చూసుకునే వరకు.. మీరు ఓడారంటే.. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా సేపే చర్చ సాగింది.. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా… సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, గెలుపోటములు సర్వ సాధారణమేనని బదులిచ్చిన టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు.. ఇదే సమయంలో చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు..
Read Also: ఏ4 సైజు పేపర్ వినియోగంపై హైకోర్టులో విచారణ
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. నెల్లూరులో అచ్చెన్న ఇంఛార్జ్గా ఉన్నారని గుర్తుచేశారు మంత్రి అనిల్ కుమార్.. దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. అయితే, సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారట.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం అంటే.. కుప్పంలో ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసు అంటూ అచ్చెన్న బదులు ఇచ్చారు.
ఇక, ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించగా.. చాలా సమస్యలున్నాయి.. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ కోరింది.. కోవిడ్ సమయంలో సభను ఆన్ లైన్ ద్వారా నడపాలని గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా? అని ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తుచేయగా.. గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకుంటే ఎలా అని అంటూ ఈ నెల 26వ తేదీ వరకు సభ జరుపుదామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని సీఎం జగన్ సూచనలు చేశారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దానికి పెద్ద హడావుడెందుకు లిమిటెడ్గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని తెలిపారు.. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం ఓ చరిత్రేనని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. ఇలా.. ఎన్నికల ఫలితాల నుంచి సభ నిర్వహణ వరకు బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.
- Tags
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?