Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఎగ్జామ్ హాల్స్లో సీసీ కెమెరాలు..
- నేటి నుంచి మార్చి 24 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు..
- ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
- పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు..
- విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానున్నాయి. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన నిబంధనల ప్రకారం విద్యార్ధులకు పరీక్ష హాల్ లోకి నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
Read Also: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
అయితే, ప్రతి పరీక్ష గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్ష కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్ లు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యార్ధులు సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్ లకి చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం దగ్గర ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్ధులు సమయ పాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్యలు తలెత్తితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రలో రూమ్, టోల్ ఫ్రీనెంబర్ 1800 425 1531కి కాల్ చేయాలని సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!