Konaseema Riots: కోనసీమ అల్లర్ల కేసులో అమాయకులు బలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కోనసీమ అల్లర్ల కేసు లో అమాయకులు బలి అవుతున్నారా? తమ ఫెయిల్యూర్ లని కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు దొరికిన వాళ్ళ పై కేసులు పెడుతున్నారా? అసలు ఊళ్ళో లేని వారి పై కేసులు ఎలా పెడతారు? వాటి గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడిదే కోనసీమలో హాట్ టాపిక్ అవుతోంది.
కోనసీమ జిల్లా కి అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఈ నెల 20 న అమలాపురంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.పోలీసులు కూడా ఊహించని స్థాయి లో జనం పోగయ్యారు.. వేల మంది ఒక్కసారిగా రావడంతో భారీ విధ్వంసం సృష్టించారు.. అయితే ఆ రోజు రాత్రి నుండి పోలీసులు కేసులపై దృష్టి పెట్టారు.. అరెస్టులు కేసులు అంటూ నిందితుల కోసం కుస్తీ పడుతున్నారు.. ఇప్పటి వరకు ఈ కేసులలో 46 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.19 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులు విషయం లో పెద్ద గందరగోళం ఏర్పడింది. పోలీసులు హడావుడి కేసులతో అమాయకులు బలి అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ఇతర పనులతో ఆ రోజు అమలాపురం వచ్చిన వారు కేసులలో బుక్ అయిన వారు ఉన్నారు. తమకేమి తెలియదు అని పోలీసులు చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు..పోలీసులు మాత్రం అన్ని చట్ట పరంగా చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ ఐ ఆర్ ఫైనల్ కాదని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు.. కానీ కేసులు నమోదు అయినవారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కేసులలో తమకు సంబంధం లేకుండా ఇరుక్కున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. తమకి ఈ కేసులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు.. ఒక్క సారి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వలన భవిష్యత్తు పోతుందని అంటున్నారు. పోలీసులు కేసులు నమోదు చేయాలనే అత్యుత్సాహం ఎక్కువ ఉందని వాపోతున్నారు.
కేసులు మరిన్ని నమోదు అవుతాయని పోలీసులు చెబుతున్నారు..తమ పేర్లు ఎక్కడ ఉంటాయో అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు.. పోలీసులు ఇప్పటికే 350 సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చాలా మంది ఆ రోజు రోడ్ల పైకి వచ్చి జరిగిన ఆందోళనలను చూశారు.. అటువంటి వారి ఫోటోలు సైతం పోలీసుల లిస్ట్ లో ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో హాస్పిటల్ ,మార్కెట్ పనులు కోసం వచ్చిన చాలా మంది ఈ గొడవలలో ఇరుక్కుపోయారు.. కొందరు ఒకే పేరు తో చాలా మంది వ్యక్తులు ఉంటారు. పొరపాటున పోలీసులు ఒకరికి బదులు ఒకరిని తీసుకువెళుతున్నారు.. దాంతో నానా హైరానా పడిపోతున్నారు..కొందరు ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసి కనీసం కుటుంబ సభ్యులకి కూడా అందుబాటులోకి రావడం లేదు. మొత్తానికి కోనసీమ అల్లర్ల కేసులతో పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారు.. చాలా మంది సంబంధం లేని వాళ్ళు ఇందులో ఇరుక్కుంటున్నారు. మరి ఖాకీలు కేసులు విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.. అమాయకులను ఈ వివాదాల లోకి లాగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
India-Bangladesh: రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య రైళ్లు ప్రారంభం
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..