Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళాఖాతం నుంచి ఈస్టర్ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గురువారం పలుచోట్ల వర్షం కురిసింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 26వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉదయం పూట పొగమంచుతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
Read also: Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
ఏపీలో ఓ మోస్తరు ఆవర్తనంతో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం మూసుకుంటోందని, దీని కారణంగా 26న అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా భదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరి, పత్తికి స్వల్ప నష్టం వాటిల్లింది. వరి పైరు కోసి, ఓదెలపై ఉన్న పనులు, నూర్చి, ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో పండించిన పత్తి కూడా కొద్దిగా తడిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం కలిగిస్తుండగా.. ఇతర పంటలకు జీవం పోస్తోంది. గత వారం బంగాళాఖాతంలో తుపాను వచ్చినా రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో వరి, పత్తి రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!