గాల్లో పర్యటిస్తే తెలియదు.. వరదప్రాంతాల్లో తిరగాలి: జ్యోతుల నెహ్రూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలో ప్రస్తుతం ప్రకృతి విపత్తు వలన అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడ కనిపించడం లేదని ఆయన అన్నారు. గాల్లో పర్యటిస్తే.. ఎంత నష్టం వాటిల్లిందో తెలియదు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఎంత నష్టం వాటిల్లిందో అప్పుడు తెలస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఎంత నష్టంమైందో ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. డెల్టా ప్రాంతాల్లో కూడా నష్టం ఏర్పడింది. అధికారం కోసం వేల కిలోమీటర్లు తిరిగిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ముంపు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముంపు ప్రాంతాల్లో ఆలస్యంగా వెళ్ళిన వైసీపీ నాయకులపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు జ్యోతుల నెహ్రూ. వ్యవసాయశాఖ మంత్రి వరి పంట వెయ్యవద్దు అనడం దారుణమన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. విద్యుత్ కొరత రాబోతుందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిని బట్టి పంటలు వేయొద్దని వ్యవసాయ శాఖ అంటుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రికి అసలు ఆ శాఖ పైనా ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు, వరద బాధితులకు వెంటనే జిల్లాల వారీగా నష్టపరిహారం అందించాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- OTR: నిడదవోలు కూటమిలో కొరకరాని కొయ్యలా బూరుగుపల్లి
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Tags
- flood areas
- Jyotula Nehru
- tdp
- ycp
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!