Guntur Husband Crime: భార్యాభర్తల మధ్య ‘ఆ’ చిచ్చు.. పార్లర్లోనే చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Koteswara Rao Killed His Wife Swathi: గుంటూరు జిల్లాలోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న భార్యను భర్త కిరాతకంగా హతమార్చాడు. ‘స్థలం’ విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణం. స్థలం అమ్మాలని చాలారోజుల నుంచి భర్త కోరుతుండగా.. భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. పార్లర్లోనే భార్యని కత్తితో నరికి చంపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గాంధీ నగర్కు చెందిన కోటేశ్వరరావు(35)కి కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి(31) అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. పెళ్లైన కొన్నాళ్ల వరకూ వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వారి సంసారం నడిచింది.
కానీ.. ఆ తర్వాత కోటేశ్వరరావు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రానురాను అతడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈమధ్య బాకీలు తారాస్థాయికి చేరుకోవడంతో.. భార్య పేరు మీదున్న స్థలాన్ని అమ్మేసి, ఆ అప్పులు తీర్చాలని అనుకున్నాడు. అయితే.. స్వాతి అందుకు ఒప్పుకోలేదు. ‘నీ బాకీలకు నా స్థలం ఎందుకు అమ్మాలి?’ అని ఎదురు తిరిగింది. కోటేశ్వరరావు ఎంత వేడుకున్నా.. స్వాతి స్థలం అమ్మేందుకు అస్సలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం (17-11-22) కూడా ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈసారి కూడా ససేమిరా అనేసిన స్వాతి, బ్యూటీ పార్లర్కి వెళ్లిపోయింది. దీంతో కోపాద్రిక్తుడైన కోటేశ్వరరావు.. నేరుగా బ్యూటీపార్లర్కు వెళ్లి, కత్తితో నరికి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహంపై దండలు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
ఈ కేసులో ఎలాగో తాను దొరికిపాతానుకున్నాడో ఏమో.. భార్యని చంపిన అనంతరం రూపర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కోటేశ్వరరావు లొంగిపోయాడు. తన భార్య స్థలం అమ్మేందుకు ఒప్పుకోకపోవడం వల్లే తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనని చెప్పాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
-
Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!