Mobile Number: ఓ వివాహిత ప్రాణం తీసిన కొత్త నంబర్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Number: ఆంధ్రప్రదేశ్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఫోన్కు కొత్త నంబర్ నుంచి ఫోన్ రావడంతో అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణతాంగాళ్ పంచాయతీకి వెంకటేశ్ అలియాస్ పండు కై లాసనాథకోన అనే వ్యక్తి ఈశ్వరకాలనీకి చెందిన గాయత్రి(32)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Cinema At Manipur: మణిపూర్లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
కాగా.. కొన్ని రోజుల క్రితం గాయత్రి చంద్రగిరిలో ఉంటున్న తన సోదరి రోజా ఇంటికి వెళ్లి వచ్చింది. అనంతరం రోజా ఒక కొత్త నంబర్ నుంచి తన అక్క గాయత్రికి ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. అయితే.. గాయత్రి ఫోన్లో ఈ కొత్త నంబర్ని వెంకటేశ్ గమనించాడు. అతనికి అది రోజా నంబర్ అనే విషయం తెలీదు. దీంతో.. అతడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరెవరితోనో సన్నిహితంగా మెలుగుతోందని భావించాడు. ఆ అనుమానంతోనే గాయత్రిని వేధించడం మొదలుపెట్టాడు. రానురాను ఈ అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో.. తన భార్యని అంతమొందించాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు.
Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
భర్త వేధింపులతో గాయత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే అదునుగా భావించి.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గాయత్రి నిద్రపోతున్నప్పుడు, వెంకటేశ్ ఆమె తలపై బండరాయితో గట్టిగా బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేరం చేసింది తనేనని పోలీసుల విచారణలో తేలిపోతుందని భావించి.. తానే పోలీస్ స్టేషన్కి వెళ్లి వెంకటేశ్ లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!