Mobile Number: ఓ వివాహిత ప్రాణం తీసిన కొత్త నంబర్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Number: ఆంధ్రప్రదేశ్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఫోన్కు కొత్త నంబర్ నుంచి ఫోన్ రావడంతో అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణతాంగాళ్ పంచాయతీకి వెంకటేశ్ అలియాస్ పండు కై లాసనాథకోన అనే వ్యక్తి ఈశ్వరకాలనీకి చెందిన గాయత్రి(32)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Cinema At Manipur: మణిపూర్లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
కాగా.. కొన్ని రోజుల క్రితం గాయత్రి చంద్రగిరిలో ఉంటున్న తన సోదరి రోజా ఇంటికి వెళ్లి వచ్చింది. అనంతరం రోజా ఒక కొత్త నంబర్ నుంచి తన అక్క గాయత్రికి ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. అయితే.. గాయత్రి ఫోన్లో ఈ కొత్త నంబర్ని వెంకటేశ్ గమనించాడు. అతనికి అది రోజా నంబర్ అనే విషయం తెలీదు. దీంతో.. అతడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరెవరితోనో సన్నిహితంగా మెలుగుతోందని భావించాడు. ఆ అనుమానంతోనే గాయత్రిని వేధించడం మొదలుపెట్టాడు. రానురాను ఈ అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో.. తన భార్యని అంతమొందించాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు.
Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
భర్త వేధింపులతో గాయత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే అదునుగా భావించి.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గాయత్రి నిద్రపోతున్నప్పుడు, వెంకటేశ్ ఆమె తలపై బండరాయితో గట్టిగా బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేరం చేసింది తనేనని పోలీసుల విచారణలో తేలిపోతుందని భావించి.. తానే పోలీస్ స్టేషన్కి వెళ్లి వెంకటేశ్ లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!