Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..
- వందేళ్ల ‘‘గంధర్వ మహాల్’’..
- నేటికి వన్నె తగ్గని కట్టడం..
- ప.గో. జిల్లా ఆచంటలో అద్భుత నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandharva mahal: బర్మా టేకు, విదేశాల నుంచి విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహల్ వందేళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్ మరించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లాకే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆచంటలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటోంది. అప్పటి ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వర్ రావు 1918లో ఈ మహల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ కాలంలోనే రూ. 10 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్యాలెస్ 1924లో నిర్మాణాన్ని పూర్తిచేసుకుంది. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో జిగేల్ అనేలా వెలిగించారని అప్పటి వరకు చెబుతున్నారు.
వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ మహల్ వైభవం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండా ఉంది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీఆర్ పాటు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులకు ఈ భవనం ఆతిథ్యం ఇచ్చింది. ఎత్తైన భవనం నాలుగు వైపుల కోట మారిది బురుజులు, బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు ఇప్పటికీ రాచఠీవిని గుర్తు చేస్తున్నాయి.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
Read Also: Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ
ఎంతో ఇష్టంతో కట్టించారు..
ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వర్ రావు తన చిన్న తనం నుంచి కోటలు చూస్తూ పెరగడంతో, తన ఊరిలో కూడామ ఇలాంటి కోట ఒకటి నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే గంధర్వ మహల్కి రూపకల్పన చేశారు. 1916లో రాజస్థాన్ వెళ్లి అక్కడ కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దాని తర్వాత ఆచంటలో అర ఎకరం స్థలంలో 1918లో మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంట్ని భవన నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ మహల్ మైసూర్ మహారాజ ప్యాలెస్, గోల్కోండ కోటను చూసిన అనుభూతిని ఇస్తుంది.
ఈ భవనంలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 బెడ్రూంలు ఉన్నాయి. ఈ గంధర్వ మహల్కి 1969లో, చివరిసారిగా 2008లో రంగులు వేశారు. ప్రస్తుతం వందేళ్ల పండగ కోసం మరోసారి రంగులు వేయించారు. ఈ గంధర్వ మహల్ లో గోడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాల వారసులు గంధర్వ మహల్ లో నివసిస్తున్నారు, నాలుగో తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారాని గోడవర్తి శ్రీరాములు తెలిపారు. శుక్రవారం నాగేశ్వర్రావు మూడో తరం వారసులు వందేళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!