High Tension In Kuppam: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. బాబు టూర్ ముందుకు సాగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension In Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటనకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.. అయితే, ఆయన పర్యటనకు అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. శాంతిపురం మండలంలో వందల మంది పోలీసుల మోహరించారు.. దీంతో, శాంతిపురం మండలం గడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ వాహన డ్రైవర్లపై పోలీసులు చేయి చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.. డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు లేఖలు కూడా ఇచ్చామని చెబుతున్నారు..
Read Also: Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్ను వదిలేసి కుట్లేశారు..!
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
మరోవైపు.. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజిని సైతం తొలగించారు పోలీసులు.. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసులు మోహరించారు.. ప్రతి గ్రామంలో, కూడళ్లలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలను దింపారు.. కాసేపట్లో బెంగుళూరు నుంచి 121- పెద్దూరు గ్రామం చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు.. అయితే, రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, చంద్రబాబు పర్యటనలో అడుగడునా ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరి చంద్రబాబు ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!