Srisailam Dam: శ్రీశైలానికి వరద వెల్లువ.. వారంలో ఫుల్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇటు ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15 వేల 783 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35 వేల 411 క్యూసెక్కులు మరోపక్క సుంకేసుల నుంచి లక్ష 52 వేల 585 క్యూసెక్కులు వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 3 లక్షల 3 వేల 779 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది.
దీంతో గడిచిన 9 రోజులలో సుమారు 35 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చింది. దీంతో జలాశయంలోని నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరిగి 859.60 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 859.60 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 104.6466 టీఎంసీలుగా నమోదైంది. మరోపక్క ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔట్ ఫ్లో గా 31,784 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు.
Also Read
ఈ వరద ఉధృతి ఇలానే మరో వారం రోజులు పాటు కొనసాగితే జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అధికారులు స్థానికులు భావిస్తున్నారు.ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి స్థిరంగా వరద కొనసాగుతోంది. ఇదిలా వుంటే.. నాగార్జునసాగర్కు దిగువన బేసిన్లో వర్షాలు తగ్గాయి. దీంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర పోటెత్తడంతో మంత్రాలయంలో నీటిమట్టం పెరిగింది. మంత్రాలయం దగ్గర స్నానఘాట్ లు మునిగిపోయాయి. రైల్వే వంతెన, మాధవరం వంతెన ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయానికి వచ్చే భక్తులను స్నానఘట్టాలకు వెళ్ళనీవడం లేదు. బారికేడ్లతో వారిని నియంత్రిస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతున్నందున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!