Srisailam Dam: శ్రీశైలానికి వరద వెల్లువ.. వారంలో ఫుల్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇటు ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15 వేల 783 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35 వేల 411 క్యూసెక్కులు మరోపక్క సుంకేసుల నుంచి లక్ష 52 వేల 585 క్యూసెక్కులు వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 3 లక్షల 3 వేల 779 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది.
దీంతో గడిచిన 9 రోజులలో సుమారు 35 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చింది. దీంతో జలాశయంలోని నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరిగి 859.60 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 859.60 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 104.6466 టీఎంసీలుగా నమోదైంది. మరోపక్క ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔట్ ఫ్లో గా 31,784 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ వరద ఉధృతి ఇలానే మరో వారం రోజులు పాటు కొనసాగితే జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అధికారులు స్థానికులు భావిస్తున్నారు.ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి స్థిరంగా వరద కొనసాగుతోంది. ఇదిలా వుంటే.. నాగార్జునసాగర్కు దిగువన బేసిన్లో వర్షాలు తగ్గాయి. దీంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర పోటెత్తడంతో మంత్రాలయంలో నీటిమట్టం పెరిగింది. మంత్రాలయం దగ్గర స్నానఘాట్ లు మునిగిపోయాయి. రైల్వే వంతెన, మాధవరం వంతెన ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయానికి వచ్చే భక్తులను స్నానఘట్టాలకు వెళ్ళనీవడం లేదు. బారికేడ్లతో వారిని నియంత్రిస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతున్నందున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!