Srisailam Dam: శ్రీశైలానికి వరద వెల్లువ.. వారంలో ఫుల్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటు గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇటు ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15 వేల 783 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35 వేల 411 క్యూసెక్కులు మరోపక్క సుంకేసుల నుంచి లక్ష 52 వేల 585 క్యూసెక్కులు వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 3 లక్షల 3 వేల 779 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది.
దీంతో గడిచిన 9 రోజులలో సుమారు 35 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చింది. దీంతో జలాశయంలోని నీటి మట్టం ఒక్కసారిగా భారీగా పెరిగి 859.60 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 859.60 అడుగులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 104.6466 టీఎంసీలుగా నమోదైంది. మరోపక్క ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔట్ ఫ్లో గా 31,784 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు.
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఈ వరద ఉధృతి ఇలానే మరో వారం రోజులు పాటు కొనసాగితే జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అధికారులు స్థానికులు భావిస్తున్నారు.ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి స్థిరంగా వరద కొనసాగుతోంది. ఇదిలా వుంటే.. నాగార్జునసాగర్కు దిగువన బేసిన్లో వర్షాలు తగ్గాయి. దీంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద కూడా 11,081 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టా కాలువలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తుంగభద్ర పోటెత్తడంతో మంత్రాలయంలో నీటిమట్టం పెరిగింది. మంత్రాలయం దగ్గర స్నానఘాట్ లు మునిగిపోయాయి. రైల్వే వంతెన, మాధవరం వంతెన ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయానికి వచ్చే భక్తులను స్నానఘట్టాలకు వెళ్ళనీవడం లేదు. బారికేడ్లతో వారిని నియంత్రిస్తున్నారు. నీటి ఉధృతి పెరుగుతున్నందున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!