Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి వేడుకలపై కలెక్టర్ సంతృప్తి.. భవానీల అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. .మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు…కానీ మొదటి రోజే క్యూ లైన్స్ లో భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు…గంటల తరబడి క్యూ లైన్స్ లో వున్నా భక్తులకు ఫ్యాన్స్ లేక త్రాగునీరు లేక అల్లాడుతున్నారు….ఇక ముసలి వాళ్లకు సైతం వాహనాలు లేకపోవటం గంటల తరబడి క్యులైన్స్లో పడిగాపులు గాయటంతో సరైన ఏర్పాట్లు చెయ్యలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే..ఇంద్రకీలాద్రి పై క్యూలైన్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ప్రవేశించిన 30 నిమిషాల్లోనే భక్తులకు దర్శనం పూర్తవుతుంది. భక్తుల నుంచి వస్తున్న సూచనలను సైతం తీసుకుంటున్నాం అన్నారు. ఏర్పాట్ల పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.. వీఐపీలకు కూడా దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు చేశాం.. దర్శనాలకు వచ్చే వీఐపీలు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఉత్సవాలు విజయవంతం అవుతాయన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు కలెక్టర్ ఢిల్లీ రావు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
Read Also: Ginna: జిన్నా వాయిదా.. ‘మా’ ప్రెసిడెంట్ గారు భయపడ్డారా..?
భవానిలా మాల ధారణ ,విరామాల సమస్యలపై కలెక్టర్ ను కలిశారు గురు భవానీలు. ఆరు రాష్ట్రాల్లో భవాని దీక్షలు నిర్వహిస్తున్నాం. 2 ఏళ్ల నుంచి హోమ గుండం ఏర్పాటు చేయడం లేదు…ప్రతి ఏటా లక్షలాది మంది భవాని భక్తులు మాల ధరించి మాల విరమణ కు దుర్గగుడి కి వస్తున్నారు. సీఎం జగన్ ,మంత్రి కొట్టు సత్యనారయణ భవానీల సమస్యపై వెంటనే స్పందించాలని గణేష్ గురుభవానీ కోరారు. భవానీల దీక్షను భగ్నం చేయవద్దన్నారు. దసరా ముగిసిన తరువాత మూడు రోజుల పాటు భవానీల కోసం హోమ గుండం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
Read Also: Pawan Kalyan: ‘సన్నాఫ్ ఇండియా’ డైరెక్టర్ తో పవన్ సినిమా.. ?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!