GVL Narasimha Rao: రాహుల్ చేసిన యాగీ ప్రజల చెవుల్లో పడలేదు.. బీహార్లో కాంగ్రెస్ బాగా దిగజారిపోయింది!
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జోరు
- 200లకు పైగా స్థానాల్లో ముందంజ
- ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్డీయే కూటమి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటేసి 200లకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమి విజయం ఖాయం కావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమర్ధవంతమైన పాలనకు ప్రజలిచ్చిన మద్దతన్నారు.
Also Read: OnePlus 15 Review: వన్ప్లస్ 15 రివ్యూ.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నాయంటే?
Also Read
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
- YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్.!
- Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా
‘అభివృద్ధికి ప్రజల పట్టం కట్టారు. బీహార్ ఊహించలేని రీతిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. ప్రధాని మోడీ పాలనను సమర్ధిస్తూ బీహార్లో ఎన్డీయే కూటమికి ప్రజలు ఓటేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కేవలం నినాదం కాదు. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనే విధంగా బీహార్ ప్రజలు ఓటేశారు. బీహార్ ఎన్నికలు కులాల సమీకరణ కాదు.. ఇది అభివృద్ధికి దక్కిన విజయం. అద్భుతమైన విజయం బీహార్లో దక్కింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రచారం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారు. 2000 సంవత్సరంలో ఆర్జేడికి మెజార్టీ సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పురుషులు ఆర్జేడికి అధికంగా ఓట్లు వేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మహిళలు బీజేపీకి అధికంగా ఓటు వేశారు. పురుషుల్లో ఉండే కులభావనలు మహిళల్లో ఉండవు. బీహార్లో మహిళలు అభివృద్ధికి, మంచి పాలనకు ఓటు వేశారు. ఓట్ల చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన యాగీ ప్రజల చెవుల్లో పడలేదు. ఓట్ల చోరీని ఎవరు పట్టించుకోలేదు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ బాగా దిగజారిపోయింది’ అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
తాజావార్తలు
-
NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్లను ప్రవేశపెట్టిన NSE..
-
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
-
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
-
Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!
-
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!