Pemmasani: వైసీపీ నేతపై గుంటూరు జిల్లా ఎస్పీకి పెమ్మసాని ఫిర్యాదు..
మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై బుధవారం నాడు జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఆయన ఖండించారు. ఇక, పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీని ఆయన కార్యాలయంలో గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు.
Read Also: RC16: శ్రీదేవి కనుక బతికి ఉంటే.. ఈ వేడుక మరో లెవెల్లో ఉండేది మావా
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
కాగా, విలేకరుల సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎస్పీ, కలెక్టర్ ను కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరాం.. అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.. తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులను ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకులు టీడీపీ నేత వాహనంపై దాడి చేసిన ఆధారాలు చూపిస్తున్నా సరే అధికారులు స్పందించకపోవడం ఏంటని పెమ్మసాని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
Read Also: Vivo T3 5G Launch: వివో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యాలయంలో సమావేశాలు పెట్టి మరీ డబ్బులు, బహుమతులు ఇచ్చే విధంగా సిద్ధపడుతున్నారు.. ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత రామాంజనేయులు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఏం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.. తమపై దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా తమకు రక్షణ లేని విధంగా పోలీసుల ముందరే వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని ఆయన స్పష్టం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో తాము టీడీపీ అదిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తాడికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
-
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
-
Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
-
West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
-
Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!