Minister Nara Lokesh: జెండా పండుగ నాకో ఎమోషన్..
- జెండా పండుగ నాకో ఎమోషన్ అన్న మంత్రి లోకేష్..
- దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ..
- ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: జెండా పండుగ అంటే నాకో ఎమోషన్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తుకొస్తాయన్నారు.. గెస్ట్ జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవన్నారు.. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు… దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం.. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి అని తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చారు..
Read Also: Revanth Reddy: ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి.. ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ ఉంది.. ఇతర ఏ వెపన్స్ చేయలేని పని ఆ వెపన్ చేస్తుంది.. ఆ వెపన్ పేరే అహింస అన్నారు మంత్రి లోకేష్.. అయితే, ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించారని గుర్తుచేశారు.. అందరిలో దేశభక్తి ఉండాలని సూచించారు లోకేష్.. ఆపరేషన్ సిందూర్ తో మన పవర్ చూపించాం.. ఆపరేషన్ సిందూర్ లో మన రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీనాయక్ మృతి చెందారు. ఆ కుటుంబాన్ని నేను కలిశాను. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో ముందుకుసాగాలన్నారు.. మరోవైపు, గత ప్రభుత్వం పదిలక్షల కోట్లు అప్పుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చాం. గత ప్రభుత్వంలో రంగుల పిచ్చి ఉండేది. ఇప్పుడు స్కూల్స్, విద్యార్దులకు ఇచ్చే బ్యాగులు, డ్రెస్సులు, పుస్తకాలలో ఎక్కడా పార్టీ రంగులు, నేతల ఫొటోలు లేకుండా చేశామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!