Guntur New Mayor: గుంటూరు కొత్త మేయర్గా కోవెలమూడి రవీంద్ర..
- గుంటూరు నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం..
- కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర..
- కోవెలమూడికి అనుకూలంగా 34 ఓట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur New Mayor: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో.. గుంటూరు మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో.. మేయర్ గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.. మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో మొత్తం 63 మందిలో 32 ఓట్లు సాధిస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. కానీ, కూటమి అభ్యర్థిగా 34 ఓట్లు వచ్చాయి.. దీంతో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.. ఆ తర్వాత కోవెలమూడి రవీంద్రతో మేయర్గా ప్రమాణస్వీకారం చేయించారు..
Read Also: Health Tips: రుచికి తీపిగా ఉన్నప్పటికీ.. మధుమేహ రోగులకు ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
గుంటూరు మేయర్ ఎన్నికపై కృష్ణా- గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రత్యేక సమావేశం ద్వారా జీఎంసీ కొత్త మేయర్ గా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర ఎన్నికవడం సంతోషంగా ఉంది అన్నారు.. టీడీపీలో మొదటినుంచి కష్టపడిన వ్యక్తి కోవెలమూడి.. అలాంటి వ్యక్తి మేయర్ అవకాశం పార్టీ ఇవ్వడం అందరికీ ఆనందంగా ఉందన్నారు.. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కలిసికట్టుగా పనిచేశారని అభినందించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.. మరోవైపు.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మేయర్ గా కోవెలమూడి రవీంద్ర గెలవడం ఆనందంగా ఉందన్నారు.. గత ఇరవై ఏళ్లుగా కోవెలమూడి పార్టీకోసం కష్టపడ్డారు. నిజమైన కార్యకర్తకు పదవి లభించింది. అభివృద్ధిలో ముందుకువెళ్లాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ మార్పు. ఎమ్మెల్యేలు, ఎంపీ, కార్పోరేటర్లు అందరం కలిసి గుంటూరు అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!