Guntur New Mayor: గుంటూరు కొత్త మేయర్గా కోవెలమూడి రవీంద్ర..
- గుంటూరు నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం..
- కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర..
- కోవెలమూడికి అనుకూలంగా 34 ఓట్లు..
Guntur New Mayor: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో.. గుంటూరు మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో.. మేయర్ గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.. మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో మొత్తం 63 మందిలో 32 ఓట్లు సాధిస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. కానీ, కూటమి అభ్యర్థిగా 34 ఓట్లు వచ్చాయి.. దీంతో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.. ఆ తర్వాత కోవెలమూడి రవీంద్రతో మేయర్గా ప్రమాణస్వీకారం చేయించారు..
Read Also: Health Tips: రుచికి తీపిగా ఉన్నప్పటికీ.. మధుమేహ రోగులకు ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
గుంటూరు మేయర్ ఎన్నికపై కృష్ణా- గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రత్యేక సమావేశం ద్వారా జీఎంసీ కొత్త మేయర్ గా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర ఎన్నికవడం సంతోషంగా ఉంది అన్నారు.. టీడీపీలో మొదటినుంచి కష్టపడిన వ్యక్తి కోవెలమూడి.. అలాంటి వ్యక్తి మేయర్ అవకాశం పార్టీ ఇవ్వడం అందరికీ ఆనందంగా ఉందన్నారు.. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కలిసికట్టుగా పనిచేశారని అభినందించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.. మరోవైపు.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మేయర్ గా కోవెలమూడి రవీంద్ర గెలవడం ఆనందంగా ఉందన్నారు.. గత ఇరవై ఏళ్లుగా కోవెలమూడి పార్టీకోసం కష్టపడ్డారు. నిజమైన కార్యకర్తకు పదవి లభించింది. అభివృద్ధిలో ముందుకువెళ్లాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ మార్పు. ఎమ్మెల్యేలు, ఎంపీ, కార్పోరేటర్లు అందరం కలిసి గుంటూరు అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!