Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్
- గుంటూరు జిల్లా పోలకం పాడు గ్రామంలో విషాదం..
- రహీం అనే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య..
- రూంకి రావాలని రహీం నా కూతురిని వేధించాడు: మీనాక్షి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: గుంటూరు జిల్లాలోని పోలకం పాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పోలూరు మీనాక్షి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనాక్షికి అదే కాలేజీలో చదివే రహీం అనే సీనియర్తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా వేధింపులుగా మారిందని ఆరోపించారు. తరచూ ఫోన్ చేసి మాట్లాడాలని, రూముకు రావాలని ఒత్తిడి చేస్తూ, అలా చేయకపోతే తన దగ్గర ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని రహీం బెదిరించినట్లు మీనాక్షి తండ్రి చెప్పారు.
Read Also: Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అంతేకాదు, ఆ ఫొటోలను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని కూడా మీనాక్షి బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి, మొన్న రాత్రి అన్ని విషయాలను మాకు చెప్పింది, “ఇక నా వల్ల కాదమ్మా, నేను చనిపోతాను” అని బాధతో చెప్పినట్లు ఆమె తల్లి వాపోయింది. అనంతరం తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మీనాక్షి కనిపించిందన్నారు.
Read Also: Neal Katyal: ట్రంప్నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
ఇక, రహీం అనే వ్యక్తి బెదిరింపులు, ర్యాగింగ్ తట్టుకోలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని మీనాక్షి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తు కోసం విమానాశ్రయంలో ఉద్యోగానికి ట్రైనింగ్ కి పంపించాలని కూడా అనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!