bird Flu: ఏపీలో తొలి బర్డ్ఫ్లూ మరణం.. రంగంలోకి కేంద్రం..
- ఏపీలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం..
- రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bird Flu: ఆంధ్రప్రదేశ్లో బర్డ్ఫ్లూ మరణం కలకలం రేపుతోంది.. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఏపీలో తొలి మరణంపై కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. దీంతో కేంద్రం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఢిల్లీ ఎన్సీబీకి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరొక డాక్టర్, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందంగా అధ్యయనం మొదలుపెట్టారు. మొదట ఎయిమ్స్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర వైద్య బృందం.. అసలు చిన్నారి పరిస్థితి ఏంటి? ఎప్పుడు జబ్బు పడింది.. ఆస్పత్రిలో ఎప్పుడు చేరారు.. ఆమెకు అందిన చికిత్స, ఎలాంటి వైద్యం అందించారు.. అన్నదానిపై చర్చించారు. ఇక, చిన్నారి మృతి చెందిన నరసరావుపేటకి వెళ్లిన కేంద్ర వైద్య బృందం.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులు చికెన్ కొన్న షాపుకు వెళ్లి శాంపిల్స్ సేకరించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి సమాచారం సేకరించారు.
Read Also: AIMIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన..
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు, నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి, ఆ తర్వాత పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం విదితమే.. బాలిక కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు.. ఇక, ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదనే వివరాలను వెల్లడించారు.. విశాఖ, విజయవాడ, కర్నూలులో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!