Vidadala Rajini: జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు..
- మెడికల్ కాలేజీలను తీసుకురావడం ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు..
- చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?..
- జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు: మాజీమంత్రి విడదల రజిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini: రాష్ట్రానికి ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు అని వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని జగన్ ఆలోచించారు.. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నది మా జగన్ ఆలోచన.. కానీ, చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అని విడదల రజిని క్వశ్చన్ చేసింది.
Read Also: Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేట్ పరం అవుతోంది అని మాజీమంత్రి రజిని ఆరోపించింది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీని దివంగత వైఎస్ఆర్ తీసుకు వచ్చారు.. కొన్ని లక్షల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు.. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు.. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాను.. ఆరోగ్య శ్రీని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది.. వైఎస్సార్, జగన్ పేర్లను ప్రజల్లో లేకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విడదల రజిని పేర్కొనింది.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..