Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: తన ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసులో విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రెండు ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకుల దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తాను ఫిర్యాదు చేసే వరకూ కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా జైలులు పంపి తన ఇంటిపై దాడి చేసినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు నా కేసు వ్యవహారంలో దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చిచెప్పారు.
ప్రధాన ఆరోపణలు:
జనవరి 31న తన ఇల్లు, కార్యాలయంపై సుమారు 7 గంటల పాటు దాడి జరిగిందని ఆరోపణ
దాడి తర్వాత తనను అరెస్ట్ చేసి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదల చేసినట్లు వెల్లడి
పోలీసులు స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేయలేదని విమర్శ
ఫిర్యాదు చేసిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆరోపణ
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
పోలీసులపై ఆరోపణలు:
దాడి చేసినవారిపై తేలికపాటి (బెయిలబుల్) కేసులు మాత్రమే నమోదు చేశారు
నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు
తనపై మాత్రం అదే సెక్షన్లతో కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు
పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఈ కేసులో అన్యాయంగా వ్యవహరించారని ఆరోపణ..
కీలక డిమాండ్లు:
దాడి, హత్యాయత్నం, ఆస్తి నష్టం కేసులు నమోదు చేయాలి
సిట్ (SIT) ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలి
నల్లపాడు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవాలి
కస్టోడియల్ టార్చర్పై విచారణ జరపాలి
ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉన్నారని ఆయన ఆరోపించిన అంబటి రాంబాబు.. అలాగే టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా విమర్శించారు. తనపై నమోదైన కేసులు, అరెస్ట్ విధానంపై ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?