Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- స్వామివారికి సమర్పించిన రూ. కోటి విలువైన కిరీటం వివాదంలోకి
- 461 గ్రాముల బంగారు కిరీటాన్ని రూ.38 లక్షలకు తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు
- బ్యాంక్ లాకర్లో ఉందంటూ కమిటీ సభ్యుల కాలయాపన
- పోలీసులను ఆశ్రయించిన దాత కుటుంబం.. విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Temple : భక్తులు దేవుడిపై భక్తితో, ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని టెంపుల్ కమిటీ సభ్యులు ఒక ప్రైవేట్ షాపులో తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
2025 జనవరిలో మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవుడికి అర్పించాలనుకున్నారు. ఏడుకొండల స్వామికి ప్రతీకగా, ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అందరి సమక్షంలో, ఒక పెద్ద వేడుక నిర్వహించి స్వామివారికి ఈ కిరీటాన్ని సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. అయితే, ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు మోహనరావు , ఇతర సభ్యులు కలిసి, ఆ కిరీటాన్ని పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
విశేష రోజుల్లో, పండుగ ముహూర్తాల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతల కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కిరీటం ఎక్కడని కమిటీని నిలదీయగా.. సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకర్లో భద్రపరిచామంటూ కొన్ని రోజులుగా అబద్ధాలు చెప్తూ కాలయాపన చేశారు. అనుమానం పెరిగి దాతలు అంతర్గతంగా ఆరా తీయడంతో, కమిటీ సభ్యులు దాన్ని బయట తాకట్టు పెట్టిన అసలు విషయం బయటపడింది. స్వామివారికి అలంకరిస్తారని ఇస్తే, ఇలా భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అంటూ దాతలు, స్థానిక భక్తులు కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“మేము 81 ఏళ్ల వయసులో ఉన్నాం.. ఎంతో భక్తితో స్వామివారికి కిరీటం ఇస్తే ఇంతటి ద్రోహానికి పాల్పడ్డారు. కిరీటం ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదు. మేము స్వామికి అలంకరించమని ఇచ్చాం కానీ, వీళ్లకు తాకట్టు పెట్టుకోమని కాదు. నా కిరీటం నాకు తిరిగి ఇప్పించేస్తే, దాన్ని వేరే ఏదైనా మంచి గుడికి ఇచ్చేస్తాను. మీడియా అయినా నాకు న్యాయం చేయాలి” అంటూ వృద్ధ దాత సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర మోసంపై దాత కుటుంబ సభ్యులు గుడివాడ టూ టౌన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!