Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- స్వామివారికి సమర్పించిన రూ. కోటి విలువైన కిరీటం వివాదంలోకి
- 461 గ్రాముల బంగారు కిరీటాన్ని రూ.38 లక్షలకు తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు
- బ్యాంక్ లాకర్లో ఉందంటూ కమిటీ సభ్యుల కాలయాపన
- పోలీసులను ఆశ్రయించిన దాత కుటుంబం.. విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Temple : భక్తులు దేవుడిపై భక్తితో, ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని టెంపుల్ కమిటీ సభ్యులు ఒక ప్రైవేట్ షాపులో తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
2025 జనవరిలో మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవుడికి అర్పించాలనుకున్నారు. ఏడుకొండల స్వామికి ప్రతీకగా, ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అందరి సమక్షంలో, ఒక పెద్ద వేడుక నిర్వహించి స్వామివారికి ఈ కిరీటాన్ని సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. అయితే, ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు మోహనరావు , ఇతర సభ్యులు కలిసి, ఆ కిరీటాన్ని పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టారు.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
విశేష రోజుల్లో, పండుగ ముహూర్తాల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతల కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కిరీటం ఎక్కడని కమిటీని నిలదీయగా.. సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకర్లో భద్రపరిచామంటూ కొన్ని రోజులుగా అబద్ధాలు చెప్తూ కాలయాపన చేశారు. అనుమానం పెరిగి దాతలు అంతర్గతంగా ఆరా తీయడంతో, కమిటీ సభ్యులు దాన్ని బయట తాకట్టు పెట్టిన అసలు విషయం బయటపడింది. స్వామివారికి అలంకరిస్తారని ఇస్తే, ఇలా భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అంటూ దాతలు, స్థానిక భక్తులు కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“మేము 81 ఏళ్ల వయసులో ఉన్నాం.. ఎంతో భక్తితో స్వామివారికి కిరీటం ఇస్తే ఇంతటి ద్రోహానికి పాల్పడ్డారు. కిరీటం ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదు. మేము స్వామికి అలంకరించమని ఇచ్చాం కానీ, వీళ్లకు తాకట్టు పెట్టుకోమని కాదు. నా కిరీటం నాకు తిరిగి ఇప్పించేస్తే, దాన్ని వేరే ఏదైనా మంచి గుడికి ఇచ్చేస్తాను. మీడియా అయినా నాకు న్యాయం చేయాలి” అంటూ వృద్ధ దాత సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర మోసంపై దాత కుటుంబ సభ్యులు గుడివాడ టూ టౌన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!