Darapaneni Narendra: దారపనేని నరేంద్రకు బెయిల్.. రిమాండ్ కు జడ్జి నో
టీడీపీ నేతల్ని ఏపీ అధికార పార్టీ టార్గెట్ చేసిందని ఆపార్టీ నేతలు మండిపడ్డారు. మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర (Darapaneni Narendra)ను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ (Granted Bail) మంజూరైంది. గన్నవరం ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ విషయంలో సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. స్మగ్లింగ్ విషయంలో సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. నరేంద్రను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.
Read Also: Passenger Attack on Conductor: కండక్టర్ పై ప్రయాణికుడు దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
అనంతరం దారపనేని నరేంద్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. అంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి రెండు గంటలకు న్యాయమూర్తి వద్ద హాజరు పరిచారు సీఐడీ పోలీసులు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి … నరేంద్ర రిమాండ్ కు తిరస్కరించారు న్యాయమూర్తి.. బెయిల్ ఇవ్వడంతో దారపనేని నరేంద్రను విడుదల చేశారు పోలీసులు.. నరేంద్రకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని లాయర్లు వాదనలు వినిపించారు. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన కొల్లు అంకబాబు రిమాండును కోర్టు తిరస్కరించి.. దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసు జారీచేసింది.
ఇదే విషయాన్ని లాయర్లు గుర్తు చేశారు. నరేంద్ర రిమాండును తిరస్కరించాలని కోరారు. సీఎంవోను, ప్రభుత్వానికి అప్రతిష్ఠ వచ్చిందని.. నరేంద్ర అమరావతి పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. బాగా పలుకుబడి కలిగిన ఆయనకు రిమాండు విధించకపోతే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. కానీ ఆ వాదనలు విన్న తర్వాత జడ్జి బెయిల్ మంజూరు చేశారు.తనను సీఐడీ అధికారులు కొట్టారని నరేంద్ర జడ్జి ముందు ఆరోపించారు. దెబ్బలు బయటకు కనపడకుండా కొట్టారని.. ఝండూబామ్ రాసి మరీ చిత్రహింసలు పెట్టారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సీఐడీ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు నరేంద్ర భార్య సౌభాగ్యం హైకోర్టు సీజేకు లేఖ రాశారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తీసుకెళ్లారని.. ఎందుకు తీసుకెళుతున్నారని అడిగితే సీఐడీ పోలీసులమని చెప్పారని ప్రస్తావించారు. కొందరు పోలీసు అధికారులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. నరేంద్ర చేసిన నేరమేంటో కూడా చెప్పకుండా.. ఇంట్లోకి చొరబడి 41ఏ నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రి ఎవరి ఇంట్లోకైనా చొరబడే హక్కు పోలీసులకు ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈవ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Read Also: Cannabis plants: పెరట్లో గంజాయి సాగు.. ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!