Site icon NTV Telugu

శ్రీవారి భక్తులకు శుభవార్త

TTD

TTD

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. అయితే, కరోనా విజృంభణ సమయంలో.. పూర్తిగా దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత క్రమంగా భక్తులకు కూడా అనుమతి ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version