Godavari Water: నిండుకుండలా గోదావరి.. ధవళేశ్వరం బ్యారేజీకి వరదనీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున వున్న మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. గోదావరి నది నిండుకుండలా జలకళతో కళకళలాడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగి గోదావరికి వరద నీరు వచ్చిందా? అన్నంత సందడి నెలకొంది. కొద్ది రోజులు క్రితం వరకు గోదావరిలో నీళ్లు ఒట్టిపోయి ఇసుక తెన్నులు కనిపించి త్రాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితులను తలదన్నేలా నీటి ప్రవాహం సాగడం కనువిందు కలిగిస్తోంది.
Fisher Men Missing: ఆ మత్స్యకారుల ఆచూకీ ఎక్కడ?
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
రాజమండ్రి వద్ద గోదావరి నదిలో జల కళ మొదలైంది. నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.7 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుండి మూడు డెల్టా కాల్వలకు 9 వేల 180 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతోంది. గత నెల ఒకటవ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు గోదావరి జలాలను విడుదల చేశారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.
ముందస్తు ఖరీఫ్ సాగు నిమిత్తం ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యవసాయ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈచర్యలు తీసుకున్నారు. అయితే రైతులు సాగుకు సన్నద్ధమయ్యే లోపే గోదావరిలో నీటి నిల్వలు అడుగంటాయి. కొద్దిరోజులుగా తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు నీటి కోసం కటకట ఏర్పడే పరిస్థితులు ఎదుర్కొన్నారు. గోదావరి నీరు లేక వెలవెలబోయింది. వర్షాభావం పరిస్థితులతో నదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోయాయి. ఈనెల ఒకటి నుండి గోదావరి జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరుతుంది. గోదావరి నీటిమట్టం కనిష్ఠ స్థాయిలోకి పడిపోవడంతో ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజీకి ఉన్న 175 గేట్లు మూసివేసి ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో ఒకటి, రెండు రోజుల్లో బ్యారేజీ నుండి గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయనున్నారు.
Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. రెవెన్యూ లోటు నిధులు రిలీజ్
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!