Godavari Water: నిండుకుండలా గోదావరి.. ధవళేశ్వరం బ్యారేజీకి వరదనీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున వున్న మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. గోదావరి నది నిండుకుండలా జలకళతో కళకళలాడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగి గోదావరికి వరద నీరు వచ్చిందా? అన్నంత సందడి నెలకొంది. కొద్ది రోజులు క్రితం వరకు గోదావరిలో నీళ్లు ఒట్టిపోయి ఇసుక తెన్నులు కనిపించి త్రాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితులను తలదన్నేలా నీటి ప్రవాహం సాగడం కనువిందు కలిగిస్తోంది.
Fisher Men Missing: ఆ మత్స్యకారుల ఆచూకీ ఎక్కడ?
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
రాజమండ్రి వద్ద గోదావరి నదిలో జల కళ మొదలైంది. నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.7 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుండి మూడు డెల్టా కాల్వలకు 9 వేల 180 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతోంది. గత నెల ఒకటవ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు గోదావరి జలాలను విడుదల చేశారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.
ముందస్తు ఖరీఫ్ సాగు నిమిత్తం ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యవసాయ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈచర్యలు తీసుకున్నారు. అయితే రైతులు సాగుకు సన్నద్ధమయ్యే లోపే గోదావరిలో నీటి నిల్వలు అడుగంటాయి. కొద్దిరోజులుగా తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు నీటి కోసం కటకట ఏర్పడే పరిస్థితులు ఎదుర్కొన్నారు. గోదావరి నీరు లేక వెలవెలబోయింది. వర్షాభావం పరిస్థితులతో నదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోయాయి. ఈనెల ఒకటి నుండి గోదావరి జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరుతుంది. గోదావరి నీటిమట్టం కనిష్ఠ స్థాయిలోకి పడిపోవడంతో ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజీకి ఉన్న 175 గేట్లు మూసివేసి ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో ఒకటి, రెండు రోజుల్లో బ్యారేజీ నుండి గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయనున్నారు.
Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. రెవెన్యూ లోటు నిధులు రిలీజ్
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!